ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటితో మాట్లాడుతూ ఇప్పటికే అనేక సంఘటనల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. కొందరు అలాంటి సందర్బాల్లో చనిపోయారు కూడా. అయితే తాజాగా ఓ బాలుడు కూడా ఇలాగే చనిపోయాడు. బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతుండగా.. అది ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలలోకి వెళితే..
రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న చౌము అనే ప్రాంతంలోని ఉదయ్పురియా అనే గ్రామానికి చెందిన రాకేష్ నగర్ అనే బాలుడు శుక్రవారం బ్లూటూత్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో ఇంకో వ్యక్తితో కాల్లో మాట్లాడుతున్నాడు. ఉన్నట్లుండా సడెన్గా ఆ ఇయర్ ఫోన్స్ పేలాయి. దీంతో రాకేష్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా అతను బ్లూటూత్ పేలి గాయాలు అవడంతోపాటు కార్డియాక్ అరెస్టు వల్ల చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. అయితే ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటిలో మాట్లాడుతుండగా అవి పేలి కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ బ్లూటూత్ పేలి ఒకరు చనిపోవడం దేశంలో బహుశా ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…