టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఎన్నో గొప్ప కార్యాలను చేపట్టవచ్చు. కానీ ఇదే అవకాశంగా భావించి కొందరు అదే టెక్నాలజీని ఉపయోగించుకుని చెడు పనులను కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ముఠా యాపిల్ కంపెనీకి చెందిన వాచ్ ను ఉపయోగించి ఏకంగా మూడు కోట్ల రూపాయల దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్లో గత ఏడాది జరిగింది. అయినప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒక ముఠా పలు దొంగతనాలకు పాల్పడుతూ ఉండగా ఒక రోజు బ్యాంకు నుంచి ఒక వ్యక్తి బరువైన బ్యాగ్ ను తీసుకువెళ్లడం గమనించారు. ఈ క్రమంలోనే ఆ బ్యాగును దొంగతనం చేయాలని భావించిన యువకులు ఆ కారు బంపర్ కింద స్మార్ట్ ఆపిల్ వాచ్ ని అతికించారు. ఆ కారు వెళ్తున్న మార్గంలోనే దుండగులు కూడా ప్రయాణించారు.
ఇంతలో ఆ కారు హోటల్ దగ్గరికి వెళ్లడంతో సదరు వ్యక్తి హోటల్ లోపలికి వెళ్ళాడు. అయితే ఈ దొంగ ముఠాలలో ఒక వ్యక్తి కారు విండోకి షూట్ చేసి అందులో బ్యాగ్ ఉందా లేదా చెక్ చేశాడు. ఈ క్రమంలోనే బ్యాగ్ కారులో లేకపోగా ఆ వ్యక్తి హోటల్ లో ఏ గదిలో ఉన్నాడో అక్కడికి వెళ్లి రూమ్ డోరు కొట్టారు. ఆ వ్యక్తి తలుపు తీయగా నుదుటన గన్ పెట్టి అతన్ని బాత్రూంలో బంధించి దొంగలు ఆ డబ్బులు ఉన్న బ్యాగు దొంగలించారు. అయితే ఆ దొంగలు ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు హోటల్ లో ఉన్న టెక్నికల్ సెన్సార్ల ద్వారా బయట పడింది. ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని దొంగలు ఏకంగా మూడు కోట్ల రూపాయలను ఎంతో అవలీలగా దొంగతనం చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…