పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించారు. సరైన సమయంలో వైద్యం అందించలేదు. ఆమె పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష అనే మహిళ రెండవసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం వెంటనే రాత్రి 8 గంటల సమయంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం అవుతుందని వేచి చూశారు. అయితే అనూషకి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో తన బాధను చూడలేక కుటుంబసభ్యులు తనకు ఆపరేషన్ చేయాలని వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో అనూష సిజేరియన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ చేసిన తర్వాత వైద్యులు అనూష పట్ల నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆమెకు అధిక రక్తస్రావం జరిగి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది.
ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను ఆంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఏం జరిగిందని ఆరాతీస్తే అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు సైతం ఆంబులెన్స్ లో కరీంనగర్ ఆస్పత్రికి బయలుదేరగా.. అప్పటికే అనూష మరణించిందని చెప్పడంతో.. బాధిత కుటుంబ సభ్యులు అనూష మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలను కోల్పోయిందంటూ.. ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పేషంట్ ల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించే వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…