ఆడక ఆడక పాకిస్థాన్లో మ్యాచ్లు ఆడుదామని న్యూజిలాండ్ ప్రిపేర్ అయి వచ్చింది. 18 ఏళ్ల తరువాత ఎట్టకేలకు పాక్ లో అడుగు పెట్టిన కివీస్ బ్యాట్స్ మెన్ మ్యాచ్లు ఆడేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం రావల్పిండిలో మధ్యాహ్నం 3 గంటలకు మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ ఎంత సేపు వేచి చూసినా కివీస్ బ్యాట్స్ మెన్ మాత్రం హోటల్కే పరిమితం అయ్యారు. స్టేడియంకు రాలేదు.
న్యూజిలాండ్కు చెందిన సెక్యూరిటీ నిపుణుల సలహా మేరకు పాక్తో ఆడాల్సిన మ్యాచ్లను.. టూర్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో ప్లేయర్లు స్టేడియం వరకు రాకుండానే హోటల్ నుంచి అటు నుంచి అటే న్యూజిలాండ్కు ప్రయాణం కానున్నారు.
పాకిస్థాన్ తో నెలకొన్న అనేక వివాదాల కారణంగా ఇప్పటికే భారత్ మ్యాచ్ లను ఆడడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే పాక్తో భారత్ తలపడుతోంది. అయితే కొన్నేళ్ల కింద శ్రీలంక జట్టు పాక్లో ఆడేందుకు వెళ్లింది. కానీ వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. అదృష్టవశాత్తూ అందులో ఎవరి ప్రాణాలు పోలేదు. కానీ అప్పటి నుంచి పాక్లో క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు. ఇతర దేశాలు పాక్లో క్రికెట్ ఆడేందుకు భయ పడుతున్నాయి.
అయితే ఎట్టకేలకు న్యూజిలాండ్ పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు అంగీకరించింది. అందులో భాగంగానే మూడు వన్డేలు, 5 టీ20లు రావల్పిండి, లాహోర్లలో జరగనున్నాయి. ఈ టూర్లో భాగంగా మొదటి వన్డే శుక్రవారం ప్రారంభం కావల్సి ఉంది. కానీ కివీస్ ప్లేయర్లు హోటల్కే పరిమితం అయ్యారు. పాక్ భద్రతా విభాగం అధికారులు వారికి ఎంత నచ్చజెప్పినా వారు హోటల్ను వీడలేదు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి భద్రతా విభాగం అధికారులు అలర్ట్ చేయడంతో ఇక కివీస్ ప్లేయర్లు టూర్ మొత్తం ఆడేదిలేదని, రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. దీంతో ప్లేయర్లు స్టేడియంకు రాకుండానే టూర్ మొత్తం రద్దు అయింది.
నిజానికి పాకిస్థాన్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరగక చాలా ఏళ్లు అవుతోంది. ఈ టూర్తో అయినా క్రికెట్కు అక్కడ పూర్వ వైభవం తెద్దామనుకున్నారు. కానీ సెక్యూరిటీ కారణంగా రద్దు అయింది. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు తలలు పట్టుకుంటోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…