క్రికెట్

పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడాలంటే భ‌య‌ప‌డుతున్న న్యూజిలాండ్ క్రికెటర్లు.. 18 ఏళ్ల త‌రువాత వ‌చ్చినా.. సెక్యూరిటీ కార‌ణాల‌తో టూర్ మొత్తం ర‌ద్దు..

ఆడ‌క ఆడ‌క పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడుదామ‌ని న్యూజిలాండ్ ప్రిపేర్ అయి వ‌చ్చింది. 18 ఏళ్ల త‌రువాత ఎట్ట‌కేల‌కు పాక్ లో అడుగు పెట్టిన కివీస్ బ్యాట్స్ మెన్ మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అయ్యారు. శుక్ర‌వారం రావ‌ల్పిండిలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొద‌టి వ‌న్డే మ్యాచ్ ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ ఎంత సేపు వేచి చూసినా కివీస్ బ్యాట్స్ మెన్ మాత్రం హోట‌ల్‌కే ప‌రిమితం అయ్యారు. స్టేడియంకు రాలేదు.

న్యూజిలాండ్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుల స‌ల‌హా మేర‌కు పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ల‌ను.. టూర్ మొత్తాన్ని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. దీంతో ప్లేయ‌ర్లు స్టేడియం వ‌ర‌కు రాకుండానే హోట‌ల్ నుంచి అటు నుంచి అటే న్యూజిలాండ్‌కు ప్ర‌యాణం కానున్నారు.

పాకిస్థాన్ తో నెల‌కొన్న అనేక వివాదాల కార‌ణంగా ఇప్ప‌టికే భార‌త్ మ్యాచ్ ల‌ను ఆడ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ టోర్నీల్లోనే పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. అయితే కొన్నేళ్ల కింద శ్రీ‌లంక జ‌ట్టు పాక్‌లో ఆడేందుకు వెళ్లింది. కానీ వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై ఉగ్ర‌దాడి జ‌రిగింది. అదృష్ట‌వ‌శాత్తూ అందులో ఎవ‌రి ప్రాణాలు పోలేదు. కానీ అప్ప‌టి నుంచి పాక్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఇత‌ర దేశాలు పాక్‌లో క్రికెట్ ఆడేందుకు భ‌య ప‌డుతున్నాయి.

అయితే ఎట్ట‌కేల‌కు న్యూజిలాండ్ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు అంగీక‌రించింది. అందులో భాగంగానే మూడు వ‌న్డేలు, 5 టీ20లు రావ‌ల్పిండి, లాహోర్‌ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ టూర్‌లో భాగంగా మొద‌టి వ‌న్డే శుక్ర‌వారం ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ కివీస్ ప్లేయ‌ర్లు హోట‌ల్‌కే పరిమితం అయ్యారు. పాక్ భ‌ద్ర‌తా విభాగం అధికారులు వారికి ఎంత న‌చ్చ‌జెప్పినా వారు హోట‌ల్‌ను వీడ‌లేదు. మ‌రోవైపు న్యూజిలాండ్ నుంచి భ‌ద్ర‌తా విభాగం అధికారులు అల‌ర్ట్ చేయ‌డంతో ఇక కివీస్ ప్లేయ‌ర్లు టూర్ మొత్తం ఆడేదిలేద‌ని, ర‌ద్దు చేసుకుంటున్నామ‌ని చెప్పారు. దీంతో ప్లేయ‌ర్లు స్టేడియంకు రాకుండానే టూర్ మొత్తం ర‌ద్దు అయింది.

నిజానికి పాకిస్థాన్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జ‌ర‌గ‌క చాలా ఏళ్లు అవుతోంది. ఈ టూర్‌తో అయినా క్రికెట్‌కు అక్క‌డ పూర్వ వైభ‌వం తెద్దామ‌నుకున్నారు. కానీ సెక్యూరిటీ కార‌ణంగా ర‌ద్దు అయింది. దీంతో ఏం చేయాలో తెలియ‌క పాక్ క్రికెట్ బోర్డు త‌ల‌లు ప‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM