ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన 3 నెలల పసికందును చిదిమేశాడు. ఢిల్లీలోని సమతా విహార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీలోని సమతా విహార్లో నివాసం ఉంటున్న రవి రాయ్ (26) గత కొంత కాలంగా ఎలాంటి పనిచేయకుండా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య సమీపంలో ఉన్న ఆదాజ్పూర్ మండీలో ఉద్యోగం చేస్తోంది. అయితే వారు సమతా విహార్కు ఒక నెల కిందటే వచ్చారు.
ఏ పని చేయకుండా ఇంట్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఉద్యోగం వెదుక్కోమని భార్య రోజూ చెబుతుండేది. దీంతో ఇద్దరికీ కొంత కాలంగా రోజూ గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు వీరు గొడవపడ్డారు. అయితే పట్టరాని కోపం వచ్చిన రవి తన 3 నెలల కుమారున్ని గోడకేసి బలంగా కొట్టాడు.
ఈ క్రమంలో ఆ పసికందు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. తల్లి ఇరుగు పొరుగు సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి రవి రాయ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…