ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన 3 నెలల పసికందును చిదిమేశాడు. ఢిల్లీలోని సమతా విహార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీలోని సమతా విహార్లో నివాసం ఉంటున్న రవి రాయ్ (26) గత కొంత కాలంగా ఎలాంటి పనిచేయకుండా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య సమీపంలో ఉన్న ఆదాజ్పూర్ మండీలో ఉద్యోగం చేస్తోంది. అయితే వారు సమతా విహార్కు ఒక నెల కిందటే వచ్చారు.
ఏ పని చేయకుండా ఇంట్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఉద్యోగం వెదుక్కోమని భార్య రోజూ చెబుతుండేది. దీంతో ఇద్దరికీ కొంత కాలంగా రోజూ గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు వీరు గొడవపడ్డారు. అయితే పట్టరాని కోపం వచ్చిన రవి తన 3 నెలల కుమారున్ని గోడకేసి బలంగా కొట్టాడు.
ఈ క్రమంలో ఆ పసికందు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. తల్లి ఇరుగు పొరుగు సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి రవి రాయ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…