ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో గొడవపడి తన 3 నెలల పసికందును చిదిమేశాడు. ఢిల్లీలోని సమతా విహార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీలోని సమతా విహార్లో నివాసం ఉంటున్న రవి రాయ్ (26) గత కొంత కాలంగా ఎలాంటి పనిచేయకుండా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య సమీపంలో ఉన్న ఆదాజ్పూర్ మండీలో ఉద్యోగం చేస్తోంది. అయితే వారు సమతా విహార్కు ఒక నెల కిందటే వచ్చారు.
ఏ పని చేయకుండా ఇంట్లో ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు, ఉద్యోగం వెదుక్కోమని భార్య రోజూ చెబుతుండేది. దీంతో ఇద్దరికీ కొంత కాలంగా రోజూ గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు వీరు గొడవపడ్డారు. అయితే పట్టరాని కోపం వచ్చిన రవి తన 3 నెలల కుమారున్ని గోడకేసి బలంగా కొట్టాడు.
ఈ క్రమంలో ఆ పసికందు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. తల్లి ఇరుగు పొరుగు సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి రవి రాయ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…