మనుషుల స్వార్థం కోసం, వారి సంపాదన కోసం అభం శుభం తెలియని చిన్నారులను కూరగాయలను అమ్మినట్టు అమ్ముతున్న ఘటన తాజాగా మధురైలోని ఇదయం అనాధ చిన్నారుల సంక్షేమ కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ శిశు సంరక్షణ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 16 మంది పిల్లలను డబ్బుల కోసం అమ్మి వారందరూ కరోనాతో చనిపోయారని రికార్డులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనాధ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఇదయం ట్రస్ట్ నుంచి 16 మంది పిల్లలు మాయం అయ్యారనే ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నటువంటి కరోనా మహమ్మారి అడ్డుపెట్టుకొని ట్రస్ట్ నుంచి చిన్నారులను పిల్లలు లేని దంపతులకు అమ్మి లక్షలకు లక్షలు డబ్బులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ ట్రస్టు నుంచి సుమారు 16 మంది పిల్లలను అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఈ ట్రస్ట్ నుంచి పిల్లలను అమ్మి వారందరూ కరోనాతో మృతిచెందారని రికార్డులు సృష్టించారు. తాజాగా మధురై జిల్లాలోని మేలూరు సమీపంలోని సేక్కిపట్టికి చెందిన ఐశ్వర్య అనే 22 ఏళ్ల మహిళ తన భర్తను కోల్పోగా తన ముగ్గురు పిల్లలను ఈ ఆశ్రమంలో చేర్పించింది.ఈక్రమంలో జూన్ 13న ఐశ్వర్య మూడు ఏళ్ల మూడవ కొడుకు మాణిక్కంకి కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అని ట్రస్ట్ నిర్వాహకుల నుంచి ఫోన్ రావడంతో ఆమె అక్కడికి చేరుకుంది.
ట్రస్ట్ నిర్వాహకుల మాటలు నమ్మశక్యంగా లేవని ఐశ్వర్య ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు విచారణలో భాగంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ట్రస్ట్ నుంచి పిల్లలను అమ్ముతూ వారు కరోనా కారణంగా చనిపోయారని రికార్డులు సృష్టిస్తూ దారుణానికి పాల్పడిన ట్రస్టు నిర్వాహకులపై మధురై కలెక్టర్ అనీష్ శేఖర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…