సాధారణంగా మనం ఏ విధమైన కూరలు వండాలో దిక్కు తెలియని నేపథ్యంలో ఈ విధమైనటువంటి రైస్ రెసిపీలను తయారు చేసుకొని తింటాము. అయితే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*బాస్మతి రైస్ రెండు కప్పులు
*స్వీట్ కార్న్ 2 కప్పులు
*ఆనియన్స్ అర కప్పు
*ఉప్పు తగినంత
*కారం అర టీ స్పూన్
*పసుపు చిటికెడు
*కరివేపాకు రెమ్మ
*కొత్తిమీర తురుము
*నాలుగు పచ్చిమిర్చి ముక్కలు
*జీలకర్ర అర టీ స్పూన్
*నూనె తగినంత
ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్వీట్ కార్న్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రబడగానే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మ వేసి బాగా కలియబెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు ముదురు ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత అందులో చిటికెడు, కారం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్స్ వేసి మరోసారి కలియబెట్టాలి. అవసరం అనుకుంటే ఇందులోకి గరంమసాల వేసుకోవచ్చు.రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న బాస్మతి రైస్ వేసి కలియబెట్టి , కొత్తిమీర తురుము చల్లుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ రైస్ తయారైనట్లే.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…