సాధారణంగా మనం ఏ విధమైన కూరలు వండాలో దిక్కు తెలియని నేపథ్యంలో ఈ విధమైనటువంటి రైస్ రెసిపీలను తయారు చేసుకొని తింటాము. అయితే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*బాస్మతి రైస్ రెండు కప్పులు
*స్వీట్ కార్న్ 2 కప్పులు
*ఆనియన్స్ అర కప్పు
*ఉప్పు తగినంత
*కారం అర టీ స్పూన్
*పసుపు చిటికెడు
*కరివేపాకు రెమ్మ
*కొత్తిమీర తురుము
*నాలుగు పచ్చిమిర్చి ముక్కలు
*జీలకర్ర అర టీ స్పూన్
*నూనె తగినంత
ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్వీట్ కార్న్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రబడగానే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మ వేసి బాగా కలియబెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు ముదురు ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత అందులో చిటికెడు, కారం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్స్ వేసి మరోసారి కలియబెట్టాలి. అవసరం అనుకుంటే ఇందులోకి గరంమసాల వేసుకోవచ్చు.రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న బాస్మతి రైస్ వేసి కలియబెట్టి , కొత్తిమీర తురుము చల్లుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ రైస్ తయారైనట్లే.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…