తెలుగు స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, అప్పుడప్పుడు అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడుతుంటారు. ఈ సెషన్ లో భాగంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతుంటారు.
ఈక్రమంలోనే అభిమానులతో ముచ్చటించిన రష్మిక తనకు విజయ్ దేవరకొండతో ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని బయటపెట్టారు. అలాగే తన పర్సనల్ పిక్ షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన డైరీ రొటీన్ వర్క్ గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు. ఇందులో ఏం రాసి ఉందంటే…
ఓ ఓ నా డైరీ మర్చిపోయాను… ఆరా నన్ను బాగా డిస్టర్బ్ చేయడంతో ఉదయమే నిద్ర లేచాను. ఈ రోజు షూటింగ్ ఏమీ లేకపోవడంతో కాసేపు టీవీ చూస్తూ కూర్చున్నాను. అనవసరంగా ఉదయాన్నే లేచాను. ఆ తర్వాత ఆరాకు ఇవ్వాల్సిన ఆహారం మందులు ఇచ్చాను ఆ తర్వాత నా టీం వస్తే వారితో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నా… అలాగే ఫోన్లోనే 2 ఇంటర్వ్యూ లకు అటెండ్ అయ్యాను.. ఆ తర్వాత ఒక మీటింగ్ కోసం రెడీ అయ్యా మీటింగ్ అంతా సవ్యంగా జరిగింది. ఇక ఓ యాడ్ ఫిలిమ్ కు డబ్బింగ్ చెప్పాను.అది పూర్తికాగానే తిరిగి రాత్రి ఎనిమిదింటికి రిటర్న్ వచ్చి ఆరాకు ఫుడ్డు మెడిసన్ ఇచ్చి ఇద్దరం కలిసి పడుకున్నాము. అంటూ తన డైరీలో ఉన్న విషయాలను పూసగుచ్చినట్లు అభిమానులకు చెప్పారు
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…