ముంబైకి చెందిన ఓ యువతి చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణాలనే తీసింది. టూత్ పేస్ట్ అనుకుని ఆమె ఎలుకల విషంతో దంతాలను తోముకుంది. తరువాత హాస్పిటల్లో చేరి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని ధారవికి చెందిన 18 ఏళ్ల అఫ్సానా ఖాన్ అనే యువతి సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం యథావిధిగానే నిద్రలేచి దంతాలను తోముకుంది. అయితే అంతకు ముందు టూత్ పేస్ట్ వద్ద ఎలుకల విషాన్ని ఎవరో ఉంచారు. ఆ విషయాన్ని గమనించని ఆమె టూత్ పేస్ట్కు బదులుగా ఎలుకల విషంతో దంతాలను తోముకుంది.
తరువాత కొంత సేపటికి తల తిరిగినట్లు అనిపించి, కడుపులో నొప్పిగా ఉండడంతో ఎందుకో ఆమె టూత్పేస్ట్ను చెక్ చేస్తే అది ఎలుకల విషం అని తేలింది. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఆమెను పలు ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించారు. కానీ ఎక్కడా ఆమెకు మెరుగైన వైద్యం లభించలేదు.
చివరకు ఆమె పరిస్థితి క్షీణిస్తుండగా ఆమెను సెప్టెంబర్ 12వ తేదీన సర్ జేజే హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…