ముంబైకి చెందిన ఓ యువతి చేసిన చిన్న పొరపాటు ఆమె ప్రాణాలనే తీసింది. టూత్ పేస్ట్ అనుకుని ఆమె ఎలుకల విషంతో దంతాలను తోముకుంది. తరువాత హాస్పిటల్లో చేరి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని ధారవికి చెందిన 18 ఏళ్ల అఫ్సానా ఖాన్ అనే యువతి సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం యథావిధిగానే నిద్రలేచి దంతాలను తోముకుంది. అయితే అంతకు ముందు టూత్ పేస్ట్ వద్ద ఎలుకల విషాన్ని ఎవరో ఉంచారు. ఆ విషయాన్ని గమనించని ఆమె టూత్ పేస్ట్కు బదులుగా ఎలుకల విషంతో దంతాలను తోముకుంది.
తరువాత కొంత సేపటికి తల తిరిగినట్లు అనిపించి, కడుపులో నొప్పిగా ఉండడంతో ఎందుకో ఆమె టూత్పేస్ట్ను చెక్ చేస్తే అది ఎలుకల విషం అని తేలింది. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఆమెను పలు ప్రైవేటు హాస్పిటళ్లకు తరలించారు. కానీ ఎక్కడా ఆమెకు మెరుగైన వైద్యం లభించలేదు.
చివరకు ఆమె పరిస్థితి క్షీణిస్తుండగా ఆమెను సెప్టెంబర్ 12వ తేదీన సర్ జేజే హాస్పిటల్కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…