పెళ్లి పేరిట కొందరు మహిళలు పురుషులను మోసం చేసిన సంఘటనలను ఇటీవలి కాలంలో చాలానే చూస్తున్నాం. అయినప్పటికీ ఈ తరహా మోసాలు ఆగడం లేదు. కొందరు పురుషులు పెళ్లి కావడం లేదని, తమకు వచ్చిన ఆఫర్ను కాదనలేక పెళ్లి చేసుకుంటున్నారు. అయితే వధువు చేతిలో మోసపోతున్నారు. కొందరు మహిళలు ఇలా పెళ్లి పేరిట నమ్మించి మోసం చేస్తున్నారు. పెళ్లి అయ్యాక అదును చూసి డబ్బు, నగలతో పారిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని మణిపురి బెవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరౌంఖా గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తికి వయస్సు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదు. దీంతో ఓ మధ్యవర్తి ద్వారా ఒక సంబంధం కుదిరింది. అయితే ఆ యువతి రాజును పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం రూ.80వేలు ఇవ్వాలని అడిగారు. అందుకు రాజు తండ్రి సరేనని అంగీకరించాడు.
ఈ క్రమంలోనే వారికి ఓ ఆలయంలో వివాహం జరిపించారు. పెళ్లికి ముందు వధువుకు రూ.80వేలు ఇచ్చారు. అలాగే రాజు తండ్రి తన కోడలికి డబ్బు, నగలు, ఇతర బహుమతులను కూడా ఇచ్చాడు. అయితే పెళ్లి అయ్యాక సొంత గ్రామానికి తిరిగి వచ్చే క్రమంలో బస్టాండ్లో దంపతులు బస్సు కోసం వచ్చారు. తనకు దాహం అవుతుందని వధువు చెప్పే సరికి రాజు నీళ్లను తెచ్చేందుకు వెళ్లాడు. అదే అదునుగా భావించిన ఆ వధువు అక్కడి నుంచి డబ్బు, నగలతో పరారైంది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని సదరు మధ్యవర్తితోపాటు ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…