టెక్నాలజీ ప్రస్తుతం ఎంతగానో మారింది. అయినప్పటికీ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా తగ్గలేదు. తమకు కుమార్తె వద్దని, కొడుకే కావాలని చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. కానీ కుమార్తె అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అని, ఆమె పుడితే సంతోషించాలని కొందరు చాటి చెబుతున్నారు. ఆ వ్యాపారి కూడా అలాగే చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మధ్యప్రదేశ్లోని కోలార్ అనే ప్రాంతానికి చెందిన ఆంచల్ గుప్తా 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. గత 20 ఏళ్లుగా పానీ పూరీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఇటీవల కుమార్తె జన్మించింది. దీంతో తనకు లక్ష్మీదేవి పుట్టిందని అతను సంతోషిస్తూ ఆదివారం అతను రూ.40వేల విలువ చేసే పానీ పూరీలను జనాలకు ఉచితంగా పంపిణీ చేశాడు. అందరూ అతనికి కుమార్తె పుట్టినందుకు అభినందించారు.
ఈ సందర్భంగా ఆంచల్ గుప్తా మాట్లాడుతూ తనకు ఎల్లప్పుడూ కుమార్తె కావాలని ఉండేదని, అయితే మొదటి సంతానంగా కొడుకు పుట్టాడని తెలిపాడు. కానీ రెండో సంతానంగా కుమార్తె జన్మించిందని, తాను అనుకున్న విధంగా జరిగిందని, అందుకనే సంతోషంతో పానీ పూరీలను పంపిణీ చేశానని తెలిపాడు. కాగా ఆంచల్ గుప్తాకు చెందిన ఇద్దరు సోదరులు ఇంజినీర్లుగా స్థిర పడ్డారు. ఈయన మాత్రం పానీ పూరీ వ్యాపారం చేస్తున్నాడు. కానీ గుప్తా భార్య డిగ్రీ చదివింది. దీంతో వారు సొంతంగా టైలరింగ్ వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నారు. తమకు కుమార్తె పుట్టినందుకు అతను పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…