టెక్నాలజీ ప్రస్తుతం ఎంతగానో మారింది. అయినప్పటికీ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా తగ్గలేదు. తమకు కుమార్తె వద్దని, కొడుకే కావాలని చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. కానీ కుమార్తె అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అని, ఆమె పుడితే సంతోషించాలని కొందరు చాటి చెబుతున్నారు. ఆ వ్యాపారి కూడా అలాగే చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మధ్యప్రదేశ్లోని కోలార్ అనే ప్రాంతానికి చెందిన ఆంచల్ గుప్తా 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. గత 20 ఏళ్లుగా పానీ పూరీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఇటీవల కుమార్తె జన్మించింది. దీంతో తనకు లక్ష్మీదేవి పుట్టిందని అతను సంతోషిస్తూ ఆదివారం అతను రూ.40వేల విలువ చేసే పానీ పూరీలను జనాలకు ఉచితంగా పంపిణీ చేశాడు. అందరూ అతనికి కుమార్తె పుట్టినందుకు అభినందించారు.
ఈ సందర్భంగా ఆంచల్ గుప్తా మాట్లాడుతూ తనకు ఎల్లప్పుడూ కుమార్తె కావాలని ఉండేదని, అయితే మొదటి సంతానంగా కొడుకు పుట్టాడని తెలిపాడు. కానీ రెండో సంతానంగా కుమార్తె జన్మించిందని, తాను అనుకున్న విధంగా జరిగిందని, అందుకనే సంతోషంతో పానీ పూరీలను పంపిణీ చేశానని తెలిపాడు. కాగా ఆంచల్ గుప్తాకు చెందిన ఇద్దరు సోదరులు ఇంజినీర్లుగా స్థిర పడ్డారు. ఈయన మాత్రం పానీ పూరీ వ్యాపారం చేస్తున్నాడు. కానీ గుప్తా భార్య డిగ్రీ చదివింది. దీంతో వారు సొంతంగా టైలరింగ్ వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నారు. తమకు కుమార్తె పుట్టినందుకు అతను పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…