కామ పిశాచి.. పరాయి స్త్రీలను అలా చూస్తూ పైశాచికానందం.. చివరికి కటకటాలపాలు..

August 25, 2021 9:27 PM

అతనికి పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు. అతనొక మాజీ పోలీసు కొడుకు. చెడు వ్యసనాల వల్ల చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన ఆ వ్యక్తి ఇంట్లో భార్య ఉండగానే మరొక స్త్రీ పట్ల ఎంతో పాడుబుద్ధి చూపాడు. అయితే ఈ విషయం గ్రహించిన సదరు మహిళ ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి అతన్ని కటకటాల వెనక్కి పంపించింది. ఈ ఘటన తంజావూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తంజావూరు కు చెందిన మాజీ డిప్యూటీ పోలీసు కమిషనర్ కొడుకు నసీర్ అహ్మద్ కు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగి ఒక కూతురు కూడా ఉంది. అతనికి పెళ్లి జరిగినప్పటికీ అతనిలో ఉన్న పైశాచికత్వం మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోన్నే తన ఇంటి పక్కన అద్దెకు ఓ కుటుంబం నివాసముంటున్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్ గా పని చేస్తుండగా భార్య, కూతురు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ ఇంటికి వెనుక వైపు బాత్రూం ఉంది. ఆ బాత్రూం వెనుకవైపు ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది. ఎవరైనా అద్దెకు వస్తే ఆ ఇంటిని చూపించమని ఆ ఇంటి ఓనర్ నసీర్ కి తాళాలు ఇచ్చాడు.

ఇదే అదునుగా భావించిన నసీర్ ప్రతి రోజు మేడపైకి వెళ్లి పక్కింటి ఆవిడ, తన కూతురు స్నానం చేస్తుంటే చూసి పైశాచిక ఆనందం పొందేవాడు. ఈ క్రమంలోనే ఒక రోజు ఎవరికీ తెలియకుండా ఆ బాత్రూంలో కెమెరాను అమర్చాడు. వారు స్నానాలు చేస్తుంటే ఆ వీడియోలను చూసి ఆనందపడే వాడు. ఒకరోజు బాత్రూమ్ కిటికీ బయట పైపు లేజర్ లైట్ వెలుగడం చూసిన మహిళ విషయాన్ని తన భర్తకు చేరవేసింది. ఈ క్రమంలోనే వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నసీర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా ఒక రోజు ఆ మహిళ భర్తకు, నసీర్ కి గొడవ జరగడంతో వారిపై పగ పెంచుకున్న నసీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో వెల్లడైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment