ఆన్లైన్ గేమ్స్ అనేవి పెద్దలే కాదు పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. వాటి బారిన పడి ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలుడు ఓ ఆన్లైన్ గేమ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన తల్లి తిట్టే సరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల కృష్ణ అనే బాలుడు స్థానికంగా ఉన్న నీవ్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. అతను ఫ్రీ ఫైర్ అనే స్మార్ట్ ఫోన్ గేమ్కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే తన తల్లి అకౌంట్ నుంచి రూ.40వేలను ఖర్చు చేసి ఆన్లైన్ లో ఆ గేమ్లో పోటీ పడ్డాడు. కానీ అతను గేమ్ లో ఓడిపోవడంతో ఆ రూ.40వేలు పోయాయి.
అయితే విషయం తెలుసుకున్న కృష్ణ తల్లి అతన్ని తిట్టింది. దీంతో అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను ఓ సూసైడ్ నోట్ను కూడా రాశాడు.
సారీ.. అమ్మా.. మీకు అమర్యాద కలిగించాను. గేమ్ లో రూ.40వేలు పోయాయి. సారీ.. ఏడవకు.. అని ఓ నోట్ రాశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణ తల్లి స్థానికంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్య సిబ్బందిగా పనిచేస్తుండగా.. తండ్రి ఓ పాథాలజీ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆన్లైన్ గేమ్స్కు బానిసై డబ్బులు పోగొట్టుకుని ఆ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…