ఆన్లైన్ గేమ్స్ అనేవి పెద్దలే కాదు పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. వాటి బారిన పడి ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలుడు ఓ ఆన్లైన్ గేమ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన తల్లి తిట్టే సరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల కృష్ణ అనే బాలుడు స్థానికంగా ఉన్న నీవ్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. అతను ఫ్రీ ఫైర్ అనే స్మార్ట్ ఫోన్ గేమ్కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే తన తల్లి అకౌంట్ నుంచి రూ.40వేలను ఖర్చు చేసి ఆన్లైన్ లో ఆ గేమ్లో పోటీ పడ్డాడు. కానీ అతను గేమ్ లో ఓడిపోవడంతో ఆ రూ.40వేలు పోయాయి.
అయితే విషయం తెలుసుకున్న కృష్ణ తల్లి అతన్ని తిట్టింది. దీంతో అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను ఓ సూసైడ్ నోట్ను కూడా రాశాడు.
సారీ.. అమ్మా.. మీకు అమర్యాద కలిగించాను. గేమ్ లో రూ.40వేలు పోయాయి. సారీ.. ఏడవకు.. అని ఓ నోట్ రాశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణ తల్లి స్థానికంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్య సిబ్బందిగా పనిచేస్తుండగా.. తండ్రి ఓ పాథాలజీ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆన్లైన్ గేమ్స్కు బానిసై డబ్బులు పోగొట్టుకుని ఆ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…