సాధారణంగా వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకునే మున్సిపల్ సిబ్బంది సంరక్షణ కేంద్రాల్లో విడిచి పెడతారు. లేదా కెన్నల్స్లో పెట్టి దత్తత తీసుకునే వారికి అందజేస్తారు. అయితే ఆ అధికారులు మాత్రం దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 300 కుక్కలను చంపేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగపాలెం పంచాయతీకి చెందిన అధికారులు 300 కుక్కలకు విషం పెట్టి చంపారు. విషపు ఇంజెక్షన్లను ఇచ్చి వాటిని బలి తీసుకున్నారు. ఈ క్రమంలో వాటిని కనీసం పూడ్చకుండా గొయ్యిలో పడేశారు. అయితే వాటిని అలా చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులపై ఆగ్రహిస్తున్నారు.
మూగజీవాల పట్ల అంతలా పాశవికతను ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. కుక్కలను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు మాత్రం.. కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని, అందుకనే చంపేశామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…