సాధారణంగా వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకునే మున్సిపల్ సిబ్బంది సంరక్షణ కేంద్రాల్లో విడిచి పెడతారు. లేదా కెన్నల్స్లో పెట్టి దత్తత తీసుకునే వారికి అందజేస్తారు. అయితే ఆ అధికారులు మాత్రం దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 300 కుక్కలను చంపేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగపాలెం పంచాయతీకి చెందిన అధికారులు 300 కుక్కలకు విషం పెట్టి చంపారు. విషపు ఇంజెక్షన్లను ఇచ్చి వాటిని బలి తీసుకున్నారు. ఈ క్రమంలో వాటిని కనీసం పూడ్చకుండా గొయ్యిలో పడేశారు. అయితే వాటిని అలా చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులపై ఆగ్రహిస్తున్నారు.
మూగజీవాల పట్ల అంతలా పాశవికతను ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. కుక్కలను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు మాత్రం.. కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని, అందుకనే చంపేశామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…