సాధారణంగా వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకునే మున్సిపల్ సిబ్బంది సంరక్షణ కేంద్రాల్లో విడిచి పెడతారు. లేదా కెన్నల్స్లో పెట్టి దత్తత తీసుకునే వారికి అందజేస్తారు. అయితే ఆ అధికారులు మాత్రం దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 300 కుక్కలను చంపేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగపాలెం పంచాయతీకి చెందిన అధికారులు 300 కుక్కలకు విషం పెట్టి చంపారు. విషపు ఇంజెక్షన్లను ఇచ్చి వాటిని బలి తీసుకున్నారు. ఈ క్రమంలో వాటిని కనీసం పూడ్చకుండా గొయ్యిలో పడేశారు. అయితే వాటిని అలా చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులపై ఆగ్రహిస్తున్నారు.
మూగజీవాల పట్ల అంతలా పాశవికతను ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. కుక్కలను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు మాత్రం.. కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని, అందుకనే చంపేశామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…