టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కష్టంగా ఉండే ప్రజల జీవితం నేడు సులభతరం అయింది. ఎన్నో పనులను క్షణాల్లోనే చక్కబెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఉన్నవి కొన్ని నేడు కనుమరుగైపోయాయి. వాటిల్లో ఈ తినే పదార్థాలు, తినుబండారాలు ఒకటి. వీటిని పిల్లలు ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినేవారు. కాలక్రమేణా ఇవి అంతరించిపోయాయి. ఎక్కడో తప్ప అసలు ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. అలాంటి కొన్ని పదార్థాల్లో ఇవి కూడా ఉన్నాయి.
వీటినే కొన్ని చోట్ల రసగుల్లలు అంటారు. నిజానికి రసగుల్లలు అంటే వేరే. కానీ వీటి మధ్యలో చక్కెర పాకం ఉండేది. అవి ఎంతో తియ్యగా ఉండేవి. అందుకనే వాటిని అలా పిలిచేవారు. ఒకప్పుడు వీటిని చిన్న చిన్న బడ్డీ కొట్లలో గాజు సీసాల్లో పెట్టి అమ్మేవారు. రూపాయి ఇస్తే ఒకటి ఇచ్చేవారు. అయితే ఇవి ఇప్పుడు చాలా చోట్ల కనిపించడం లేదు.
పుల్ల ఐస్ అని తోపుడు బండిలో పెట్టుకుని బూర ఊదుతూ ఐస్లు అమ్మేవారు. పాల ఐస్, ఆరెంజ్ ఐస్, సేమియా ఐస్, కోకొ కోలా ఐస్.. ఇలా రకరకాల ఐస్లు ఉండేవి. సేమియా ఐస్ 2 రూపాయలు. మిగతావన్నీ రూపాయి. ఇప్పుడు వీటినే ఐస్ పాప్స్ అని రూ.150 నుంచి రూ.200 కి ఒక్కటి చొప్పున అమ్ముతున్నారు.
సీమ చింత కాయలనే పుల్ల చింతకాయలు అని, పులి చింతకాయలు అని అంటారు. ఇవి పండితే ఎంతో తియ్యగా ఉంటాయి. దోరగా ఉండేవి తియ్యగా, వగరుగా ఉంటాయి. ఇవి ఇప్పుడు ఎక్కడోగానీ కనిపించడం లేదు.
బాదంకాయలను చెట్టుపై ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి కింద పడేయడం ఒకెత్తయితే.. వాటిలోని పిక్కను పగలగొట్టి అందులో ఉండే పప్పును తినడం ఒకెత్తు. పిక్కను రాళ్లతో పగలగొట్టేటప్పుడు కొన్ని సార్లు చేతులకు కూడా దెబ్బలు తాకేవి. అయితే బాదం చెట్లు ఇప్పుడు చాలా చోట్ల కనిపించడం లేదు.
ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా తింటే నోరు కొట్టుకుపోతుంది. ఇవి ఒకప్పుడు బాగానే లభించేవి. కానీ ఇప్పుడు దొరకడం లేదు.
ఇక్కడ ఇచ్చినవి కొన్నే. ఇంకా ఇలాంటి ఎన్నో తినుబండారాలు, ఆహారాలు ఇప్పుడు లేవు. కనుమరుగయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…