టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కష్టంగా ఉండే ప్రజల జీవితం నేడు సులభతరం అయింది. ఎన్నో పనులను క్షణాల్లోనే చక్కబెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఉన్నవి కొన్ని నేడు కనుమరుగైపోయాయి. వాటిల్లో ఈ తినే పదార్థాలు, తినుబండారాలు ఒకటి. వీటిని పిల్లలు ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినేవారు. కాలక్రమేణా ఇవి అంతరించిపోయాయి. ఎక్కడో తప్ప అసలు ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. అలాంటి కొన్ని పదార్థాల్లో ఇవి కూడా ఉన్నాయి.
వీటినే కొన్ని చోట్ల రసగుల్లలు అంటారు. నిజానికి రసగుల్లలు అంటే వేరే. కానీ వీటి మధ్యలో చక్కెర పాకం ఉండేది. అవి ఎంతో తియ్యగా ఉండేవి. అందుకనే వాటిని అలా పిలిచేవారు. ఒకప్పుడు వీటిని చిన్న చిన్న బడ్డీ కొట్లలో గాజు సీసాల్లో పెట్టి అమ్మేవారు. రూపాయి ఇస్తే ఒకటి ఇచ్చేవారు. అయితే ఇవి ఇప్పుడు చాలా చోట్ల కనిపించడం లేదు.
పుల్ల ఐస్ అని తోపుడు బండిలో పెట్టుకుని బూర ఊదుతూ ఐస్లు అమ్మేవారు. పాల ఐస్, ఆరెంజ్ ఐస్, సేమియా ఐస్, కోకొ కోలా ఐస్.. ఇలా రకరకాల ఐస్లు ఉండేవి. సేమియా ఐస్ 2 రూపాయలు. మిగతావన్నీ రూపాయి. ఇప్పుడు వీటినే ఐస్ పాప్స్ అని రూ.150 నుంచి రూ.200 కి ఒక్కటి చొప్పున అమ్ముతున్నారు.
సీమ చింత కాయలనే పుల్ల చింతకాయలు అని, పులి చింతకాయలు అని అంటారు. ఇవి పండితే ఎంతో తియ్యగా ఉంటాయి. దోరగా ఉండేవి తియ్యగా, వగరుగా ఉంటాయి. ఇవి ఇప్పుడు ఎక్కడోగానీ కనిపించడం లేదు.
బాదంకాయలను చెట్టుపై ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి కింద పడేయడం ఒకెత్తయితే.. వాటిలోని పిక్కను పగలగొట్టి అందులో ఉండే పప్పును తినడం ఒకెత్తు. పిక్కను రాళ్లతో పగలగొట్టేటప్పుడు కొన్ని సార్లు చేతులకు కూడా దెబ్బలు తాకేవి. అయితే బాదం చెట్లు ఇప్పుడు చాలా చోట్ల కనిపించడం లేదు.
ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా తింటే నోరు కొట్టుకుపోతుంది. ఇవి ఒకప్పుడు బాగానే లభించేవి. కానీ ఇప్పుడు దొరకడం లేదు.
ఇక్కడ ఇచ్చినవి కొన్నే. ఇంకా ఇలాంటి ఎన్నో తినుబండారాలు, ఆహారాలు ఇప్పుడు లేవు. కనుమరుగయ్యాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…