Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటి వరకు కేవలం రూ.25వేల వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తూ వచ్చారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ మేర మాత్రమే పంట రుణాలను మాఫీ చేశారు. కానీ ఇకపై రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ ఆదివారం సీఎం కేసీఆర్తో సమావేశమై నిర్ణయం తీసుకుంది.
ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయంపై చర్చ జరిపారు. పంట రుణాలకు సంబంధించిన వివరాలను కేబినెట్కు ఆర్థిక శాఖ అందజేసింది. ఈ క్రమంలో రైతులకు ఆగస్టు 15వ తేదీ నుంచి పంట రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల ఆఖరి వరకు రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 6 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుంది.
ఇక రాష్ట్ర కేబినెట్లో వ్యవసాయంపై ప్రధానంగా చర్చ జరగ్గా.. అందులో రైతులకు సాగు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేబినెట్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర అంశాలపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే పత్తి పంట సాగుపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నందున ఆ పంట సాగును ఇంకా పెంచాలని, అందుకుగాను రాష్ట్ర రైతాంగాన్ని సిద్ధం చేయాలని కేబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…