సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా కాదు.. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మూవీగా బాహుబలి రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో నటులు ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు.
అయితే ఏ మూవీలో అయినా సరే చిన్న చిన్న అంశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. దర్శకులు చిన్న విషయాల్లోనూ అత్యంత జాగ్రత్త వహించి సీన్లను చిత్రీకరిస్తారు. అందుకు గాను వారు అనేక రీసెర్చిలు కూడా చేస్తారు.
బాహుబలి మొదటి పార్ట్లో రానా (భల్లాల దేవ)కు చెందిన భారీ బంగారు విగ్రహాన్ని పెద్ద ఎత్తున సైనికులు, ప్రజలు కలిసి ప్రతిష్టిస్తారు గుర్తుంది కదా. ఆ సమయంలో విగ్రహం కింద ఎరుపు రంగు పొడి ఒకటి ఉంటుంది. సీన్ లో చూస్తే తెలుస్తుంది. అయితే ఆ ఎరుపు రంగు పొడిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ?
చాలా మంది విజువల్ ఎఫెక్ట్ కోసం అలా పొడిని పెట్టుంటారు.. అని అనుకుంటారు. కానీ ఆ పొడిని అక్కడ ఉంచడం వెనుక ఉన్న కారణం అది కాదు. మరేమిటంటే..
ఒక భారీ విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్టించినప్పుడు దాన్ని ఉంచే చోట సహజంగానే ఒకేసారి విగ్రహాన్ని ఆ చోట ఎత్తేసినట్లు పెట్టాల్సి వస్తుంది. దీంతో షాక్ లాంటిది వస్తుంది. చుట్టూ ఉన్న ప్రదేశాలు ప్రకంపించినట్లు అవుతాయి. అయితే ఆ షాక్ లాంటి ప్రకంపనలు రాకుండా వాటిని శోషించుకునేందుకు ఆ ఎరుపు రంగు పొడిని ఏర్పాటు చేశారు. ఇదీ ఆ పొడిని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం. దర్శకులు ఇలాంటి చిన్న చిన్న విషయలను కూడా చాలా సీరియస్గా అమలు చేస్తుంటారు. కనుకనే అలాంటి వారు తీసే చిత్రాలు భారీగా విజయవంతం అవుతుంటాయి. బాహుబలి మూవీల విషయంలోనూ అలాగే జరిగింది. అందుకనే ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించాయి.
ఇక ఆ పొడిని ఏర్పాటు చేయకుండా ఉంటే షాక్ లాంటి ప్రకంపనలు రావడంతోపాటు విగ్రహం కూడా దెబ్బ తింటుంది. ఈ రెండు కారణాల వల్లే ఆ పొడిని ఏర్పాటు చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…