సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా కాదు.. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మూవీగా బాహుబలి రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో నటులు ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు.
అయితే ఏ మూవీలో అయినా సరే చిన్న చిన్న అంశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. దర్శకులు చిన్న విషయాల్లోనూ అత్యంత జాగ్రత్త వహించి సీన్లను చిత్రీకరిస్తారు. అందుకు గాను వారు అనేక రీసెర్చిలు కూడా చేస్తారు.
బాహుబలి మొదటి పార్ట్లో రానా (భల్లాల దేవ)కు చెందిన భారీ బంగారు విగ్రహాన్ని పెద్ద ఎత్తున సైనికులు, ప్రజలు కలిసి ప్రతిష్టిస్తారు గుర్తుంది కదా. ఆ సమయంలో విగ్రహం కింద ఎరుపు రంగు పొడి ఒకటి ఉంటుంది. సీన్ లో చూస్తే తెలుస్తుంది. అయితే ఆ ఎరుపు రంగు పొడిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ?
చాలా మంది విజువల్ ఎఫెక్ట్ కోసం అలా పొడిని పెట్టుంటారు.. అని అనుకుంటారు. కానీ ఆ పొడిని అక్కడ ఉంచడం వెనుక ఉన్న కారణం అది కాదు. మరేమిటంటే..
ఒక భారీ విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్టించినప్పుడు దాన్ని ఉంచే చోట సహజంగానే ఒకేసారి విగ్రహాన్ని ఆ చోట ఎత్తేసినట్లు పెట్టాల్సి వస్తుంది. దీంతో షాక్ లాంటిది వస్తుంది. చుట్టూ ఉన్న ప్రదేశాలు ప్రకంపించినట్లు అవుతాయి. అయితే ఆ షాక్ లాంటి ప్రకంపనలు రాకుండా వాటిని శోషించుకునేందుకు ఆ ఎరుపు రంగు పొడిని ఏర్పాటు చేశారు. ఇదీ ఆ పొడిని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం. దర్శకులు ఇలాంటి చిన్న చిన్న విషయలను కూడా చాలా సీరియస్గా అమలు చేస్తుంటారు. కనుకనే అలాంటి వారు తీసే చిత్రాలు భారీగా విజయవంతం అవుతుంటాయి. బాహుబలి మూవీల విషయంలోనూ అలాగే జరిగింది. అందుకనే ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించాయి.
ఇక ఆ పొడిని ఏర్పాటు చేయకుండా ఉంటే షాక్ లాంటి ప్రకంపనలు రావడంతోపాటు విగ్రహం కూడా దెబ్బ తింటుంది. ఈ రెండు కారణాల వల్లే ఆ పొడిని ఏర్పాటు చేశారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…