సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా కాదు.. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మూవీగా బాహుబలి రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో నటులు ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు.
అయితే ఏ మూవీలో అయినా సరే చిన్న చిన్న అంశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. దర్శకులు చిన్న విషయాల్లోనూ అత్యంత జాగ్రత్త వహించి సీన్లను చిత్రీకరిస్తారు. అందుకు గాను వారు అనేక రీసెర్చిలు కూడా చేస్తారు.
బాహుబలి మొదటి పార్ట్లో రానా (భల్లాల దేవ)కు చెందిన భారీ బంగారు విగ్రహాన్ని పెద్ద ఎత్తున సైనికులు, ప్రజలు కలిసి ప్రతిష్టిస్తారు గుర్తుంది కదా. ఆ సమయంలో విగ్రహం కింద ఎరుపు రంగు పొడి ఒకటి ఉంటుంది. సీన్ లో చూస్తే తెలుస్తుంది. అయితే ఆ ఎరుపు రంగు పొడిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ?
చాలా మంది విజువల్ ఎఫెక్ట్ కోసం అలా పొడిని పెట్టుంటారు.. అని అనుకుంటారు. కానీ ఆ పొడిని అక్కడ ఉంచడం వెనుక ఉన్న కారణం అది కాదు. మరేమిటంటే..
ఒక భారీ విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్టించినప్పుడు దాన్ని ఉంచే చోట సహజంగానే ఒకేసారి విగ్రహాన్ని ఆ చోట ఎత్తేసినట్లు పెట్టాల్సి వస్తుంది. దీంతో షాక్ లాంటిది వస్తుంది. చుట్టూ ఉన్న ప్రదేశాలు ప్రకంపించినట్లు అవుతాయి. అయితే ఆ షాక్ లాంటి ప్రకంపనలు రాకుండా వాటిని శోషించుకునేందుకు ఆ ఎరుపు రంగు పొడిని ఏర్పాటు చేశారు. ఇదీ ఆ పొడిని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం. దర్శకులు ఇలాంటి చిన్న చిన్న విషయలను కూడా చాలా సీరియస్గా అమలు చేస్తుంటారు. కనుకనే అలాంటి వారు తీసే చిత్రాలు భారీగా విజయవంతం అవుతుంటాయి. బాహుబలి మూవీల విషయంలోనూ అలాగే జరిగింది. అందుకనే ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించాయి.
ఇక ఆ పొడిని ఏర్పాటు చేయకుండా ఉంటే షాక్ లాంటి ప్రకంపనలు రావడంతోపాటు విగ్రహం కూడా దెబ్బ తింటుంది. ఈ రెండు కారణాల వల్లే ఆ పొడిని ఏర్పాటు చేశారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…