ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా 2000వ సంవత్సరంలో నోకియా 3310 ఫోన్ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్ను అప్పట్లో బండ ఫోన్ అని కూడా పిలిచేవారు. ఎన్నిసార్లు కింద పడినా పార్ట్లను అతికిస్తే మళ్లీ పనిచేసేది. అందుకనే ఈ ఫోన్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. అయితే ఆ ఫోన్ను ఓ వ్యక్తి మింగేశాడు.
కోసోవో అనే ఐరోపా దేశంలో ఉన్న ప్రిస్టినా అనే ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి నోకియా 3310 ఫోన్ను అమాంతం మింగేశాడు. దీంతో ఆ ఫోన్ అతని పొట్టలో మూడు పార్ట్లుగా విడిపోయింది. బ్యాటరీ బయటకు వచ్చింది. కొన్ని గంటల పాటు ఆ బ్యాటరీ అలాగే అతని పొట్టలో ఉంటే పేలిపోయి ఉండేదని వైద్యులు తెలిపారు. కానీ ఆ వ్యక్తి ఫోన్ను మింగాక వెంటనే కడుపునొప్పి, వాంతులు అవుతుండడంతో హాస్పిటల్కు తనంతట తానుగా వచ్చాడు.
ఇక అతన్ని ఎక్స్రే తీశాక వాటిని చూసి వైద్యులు షాక్ తిన్నారు. అతని జీర్ణాశయంలో ఆ ఫోన్ మూడు భాగాలుగా ఉండడాన్ని గుర్తించారు. వాటిల్లో ఒకటి బ్యాటరీ. కాగా వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేశారు. మొత్తం 2 గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు ఎట్టకేలకు ఆ ఫోన్ భాగాలను బయటకు తీశారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
అయితే అతను కొంచెం ఆలస్యం చేసినా అతని పొట్టలో ఉన్న ఫోన్ బ్యాటరీ పేలి ఉండేదని వైద్యులు తెలిపారు. దీంతో అతను చనిపోయి ఉండేవాడని అన్నారు. అయితే అతను ఫోన్ను ఎందుకు మింగాడు ? అన్న వివరాలు తెలియరాలేదు.
కాగా గతంలోనూ ఇలాంటి సంఘటనలే పలు మార్లు జరిగాయి. 2014లో కొందరు ఈ విధంగానే ఫోన్లను మింగారు. 2016లో ఓ 29 ఏళ్ల వ్యక్తి ఇలాగే ఫోన్ను మింగగా శస్త్ర చికిత్స చేసి ఫోన్ ను బయటకు తీశారు. ఈ విధంగా ఫోన్లను మింగడం వెనుక మానసిక అనారోగ్య కారణాలు ఉండి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…