యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దర్శకులు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజెస్ ఇస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం నుంచి కొమరం భీమ్ పోస్టర్ విడుదల చేయగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రకటన చేస్తూ ఎన్టీఆర్ కూల్ లుక్ ఒకటి విడుదల చేశారు ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన బుచ్చి బాబు సైతం ఎన్టీఆర్ తో త్వరలో సినిమా ఉంటుందని ఇండైరెక్టుగా తెలియజేశారు.
కేజిఎఫ్ లాంటి సెన్సేషనల్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు గత కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేశారు ప్రశాంత్ నీల్. రక్తంతో తడిసిన నేల ఒక్కటి మాత్రమే గుర్తుంచుకుంటుంది, ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…