ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కొద్దిగా దగ్గు జలుబు చేసిన దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందటం కోసం మిరియాల రసం ఎంతో ఉపయోగపడుతుంది.మరి దగ్గు జలుబును దూరం చేసే మిరియాల రసం ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
*రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు
*రెండు రెమ్మలు కరివేపాకు
*టేబుల్ టీస్పూన్ ధనియాలు
*రెండు ఎండుమిరపకాయలు
*1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర
*నిమ్మకాయ సైజు చింతపండు
*1/2 టేబుల్ స్పూన్ ఆవాలు
*వెల్లుల్లి రెబ్బలు
*కొత్తిమిర
*ఉప్పు తగినంత
*తగినంత నీరు
*2 టేబుల్ స్పూన్ల నూనె
ముందుగా చింతపండు కడిగి నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి ఉంచి కొద్దిగా నూనె వేసి మిరియాలు, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి మరొక గిన్నెలో పోసుకోవాలి. ఈ పులుపుకు తగ్గట్టుగా నీటిని వేసుకోవాలి. ఈ నీటిలోకి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం కలిపి స్టవ్ పై బాగా ఉడకనివ్వాలి.
స్టవ్ పై మరొక చిన్న పాన్ లో పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి, నూనె వేడెక్కాక ఆవాలు, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత ఉదుకుతున్నటువంటి మిరియాల రసంలోకి పోపు పెట్టాలి. తరువాత రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఆపై కోతిమిర చల్లుకొని మరో రెండు నిమిషాలు పాటు ఉడికించినట్లయితే ఎంతో రుచి కరమైన మిరియాల రసం తయారవుతుంది. ఈ మిరియాల రసం వేడి వేడి అన్నంలోకి తినడం లేదా చల్లారిన తర్వాత తాగటం వల్ల తొందరగా దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…