ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తే కొన్ని ప్రేక్షకులకు నచ్చవు. కానీ కొన్ని మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. అందువల్ల రీమేక్ అయినప్పటికీ ప్రేక్షకులకు కొన్ని నచ్చుతాయి. గతంలో పలు తెలుగు మూవీలు ఇలాగే హిట్ అయ్యాయి. అయితే హిందీ మూవీ అంధాధున్కు రీమేక్గా వచ్చిన నితిన్ మ్యాస్ట్రో మూవీ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ? అన్న విషయానికి వస్తే..
కథ..
అరుణ్ (నితిన్) ఒక పియానో వాయిద్యకారుడు. అతను కొన్ని కారణాల వల్ల అంధుడిగా నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతను సిమ్రన్ (తమన్నా), సీఐ బాబీ (జిష్షు సేన్గుప్తా)లు అనుకోకుండా చేసిన ఓ హత్యను చూస్తాడు. కానీ అంధుడిగా నటిస్తుండడం చేత అతను చూసిన హత్యను ఎవరికీ చెప్పలేడు. ఏమైతే అదైందని పోలీస్ స్టేషన్కు కూడ వెళ్తాడు. అక్కడ మర్డర్ రిపోర్టు ఇవ్వాలని చూస్తాడు. తరువాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అరుణ్ ఏ విధంగా ఈ సమస్య నుంచి బయట పడ్డాడు ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మూవీలో నటులందరూ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. తమన్నా భర్తగా నరేష్ కొంత సేపు కనిపించినా ఆయన నటన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగిలిన నటులు కూడా ఫర్వాలేదనిపించారు. అయితే తమన్నా ఈ మూవీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. కనుక ఆమె డైలాగ్స్ను వినేందుకు కొద్దిగా కష్టపడాలి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా బాగానే ఉంది.
హిందీ మూవీ అంధాధున్ లోని కథను దర్శకుడు మేర్లపాక గాంధీ యథావిధిగా తీసుకున్నాడు. అందువల్ల కథ అలాగే కొనసాగుతుంది. చిన్న చిన్న మార్పులు చేశారు. అయినప్పటికీ సస్పెన్స్గా కథనం సాగుతుంది. అయితే హిందీ మూవీ చూసిన వారికి మ్యాస్ట్రో పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ హిందీ మూవీని చూడకుండా ఈ మూవీనే నేరుగా చూసే వారికి కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఒక భిన్న కథాంశం కనుక ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. ఒక్కసారి ఈ మూవీని చూడవచ్చు.
రేటింగ్ – 3.5/5
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…