శ్మశానాలు అంటే సహజంగానే చాలా మందికి భయం కలుగుతుంది. అక్కడ ఎక్కువ సేపు ఉండలేరు. అయితే సమాధులను సందర్శించేందుకు మాత్రం కొందరు శ్మశానాలకు వెళ్తుంటారు. తమ ఆత్మీయుల సమాధుల వద్ద పువ్వులు ఉంచి శ్రద్ధాంజలి ఘటించి కాసేపు ఉండి వస్తుంటారు. ఇలా ఒక వ్యక్తి కూడా ఓ శ్మశానవాటికకు వెళ్లాడు. కానీ అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా భయ భ్రాంతులకు గురయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కాలిఫోర్నియాలోని సాక్రమెంటో అనే ప్రాంతంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాథలిక్ శ్మశానవాటికలో తన ఆత్మీయులకు చెందిన సమాధులను చూసేందుకు 37 ఏళ్ల జోయెల్ మోరిసన్ అనే వ్యక్తి వెళ్లాడు. అయితే అక్కడ కొన్ని సమాధుల నుంచి మృతదేహాలకు చెందిన వెంట్రుకలు బయటకు వచ్చి కనిపించాయి. దీంతో అతను ఒక్కసారిగా షాక్కు గురై తీవ్రంగా భయ పడ్డాడు. తరువాత తేరుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని అతను అక్కడి నిర్వాహకులకు చెప్పాడు. దీంతో అలా ఎందుకు జరుగుతుందో వారు పరిశీలిస్తున్నారు. అక్కడ పురాతన వృక్షాలు కొన్ని ఉన్నాయని వాటి వేర్ల వల్ల సమాధులు దెబ్బ తింటున్నాయని, అలాగే క్రూర జంతువులు కూడా సంచరిస్తున్నాయని అందుకే సమాధులు అలా అవుతున్నాయని భావిస్తున్నారు. కానీ కచ్చితమైన ఆధారాలు లభించడం లేదు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…