బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న యాంకర్లలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఎన్నో సినిమాలలో చేస్తూ హీరో స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగు లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన సొమ్మును నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా పలువురు కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ ప్రోమోలో భాగంగా విజ్వల్ నందమూరి బాలకృష్ణ గెటప్ లో అదరగొట్టారు. బాలకృష్ణ వేషధారణలో వచ్చిన విజ్వల్ అచ్చం బాలయ్యబాబు హావభావాలను వ్యక్తపరుస్తూ అందరినీ నవ్వించారు.
ఈ స్కిట్ లో భాగంగా విజ్వల్ ఈరోజు ఉదయం లేవగానే భూదేవికి నమస్కారం అంటూ భూమికి నమస్కారం చేశాడు. అదేవిధంగా సునీతను చూపిస్తూ గోమాతకు నమస్కారం అని నమస్కారం చేయగా… యాంకర్ ప్రదీప్ ని చూపిస్తూ ముత్తాతకు నమస్కారం అనగానే అందరూ ఉన్నఫలంగా నవ్వారు. అదేవిధంగా ఒక బాధితురాలు తన కూతురు క్యాన్సర్ తో బాధపడుతుంది తనకు సహాయం కావాలని కోరగానే వెంటనే తనకు సహాయం చేసినట్లు ఈ ప్రోమోలో చూపించారు. అయిన వాళ్లకు కష్టమొస్తే అరగంట అయినా ఆలస్యంగా వస్తానేమో కానీ.. ఆడపిల్లకు కష్టం వస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయను అనే డైలాగ్ ఎంతో హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఇక ఈ స్కిట్ తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న వారు బాలయ్య బాబు ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…