కొన్ని రకాల ప్రత్యేకమైన పాములను ఇంట్లో ఉంచుకున్నా, వాటికి పూజలు చేసినా అదృష్టం, ధనం కలసి వస్తాయని ఇప్పటికీ కొందరు నమ్మేవారు ఉన్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు అరుదైన జాతికి చెందిన పాములను స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని దుధ్వా అటవీ ప్రాంతంలో ఎరుపు రంగులో ఉండే కొండ చిలువను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆ పామును స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఆ వ్యక్తులను పోలీసులు శాలు కశ్యప్, ముకేష్ కశ్యప్, సందీప్ సింఘాలలుగా గుర్తించారు. వీరికి అఫ్సర్ అనే డ్రైవర్ సహకారం అందించాడు. వారు ఆ పామును ఓ కారులో స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు.
వారందరూ ఢిల్లీకి చెందిన వారు కాగా దుధ్వా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఖెరి అనే గ్రామంలో వారు ఆ పామును స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలకు కొన్నారు. దాన్ని ముంబైలో రూ.50 లక్షలకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు పట్టుబడ్డారు.
కాగా ఎరుపు రంగులో ఉండే ఆ కొండ చిలువ తోక కూడా తలలాగే ఉంటుంది. దీంతో దాన్ని మొదటి సారి చూస్తే దానికి రెండు తలలు ఉన్నాయేమోనని ఎవరైనా సరే అనుకుంటారు. ఇక ఈ పాములకు చైనాతోపాటు పలు ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులు అవుతారని కొందరు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…