కొన్ని రకాల ప్రత్యేకమైన పాములను ఇంట్లో ఉంచుకున్నా, వాటికి పూజలు చేసినా అదృష్టం, ధనం కలసి వస్తాయని ఇప్పటికీ కొందరు నమ్మేవారు ఉన్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు అరుదైన జాతికి చెందిన పాములను స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని దుధ్వా అటవీ ప్రాంతంలో ఎరుపు రంగులో ఉండే కొండ చిలువను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆ పామును స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఆ వ్యక్తులను పోలీసులు శాలు కశ్యప్, ముకేష్ కశ్యప్, సందీప్ సింఘాలలుగా గుర్తించారు. వీరికి అఫ్సర్ అనే డ్రైవర్ సహకారం అందించాడు. వారు ఆ పామును ఓ కారులో స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు.
వారందరూ ఢిల్లీకి చెందిన వారు కాగా దుధ్వా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఖెరి అనే గ్రామంలో వారు ఆ పామును స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలకు కొన్నారు. దాన్ని ముంబైలో రూ.50 లక్షలకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు పట్టుబడ్డారు.
కాగా ఎరుపు రంగులో ఉండే ఆ కొండ చిలువ తోక కూడా తలలాగే ఉంటుంది. దీంతో దాన్ని మొదటి సారి చూస్తే దానికి రెండు తలలు ఉన్నాయేమోనని ఎవరైనా సరే అనుకుంటారు. ఇక ఈ పాములకు చైనాతోపాటు పలు ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులు అవుతారని కొందరు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…