క్రికెట్
అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్లో చోటు దక్కేనా?
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ సెమీస్లో వరల్డ్ రికార్డ్.. ఒకేసారి 6.52 కోట్ల మంది వీక్షణ!
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ను ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో ఒకేసారి గరిష్టంగా 6.52 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్ ఈవెంట్లలో అత్యధిక డిజిటల్ పీక్ కన్కరెన్సీగా నమోదు అయింది.
టీ20 వరల్డ్ కప్ 2026 సరికొత్త రికార్డ్.. 50 కోట్ల వ్యూయర్షిప్తో జైషా సంచలన పోస్ట్!
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్ కప్ల వ్యూయర్షిప్ రికార్డులను బ్రేక్ చేసిందని ఐసీసీ చైర్మన్ జైషా అన్నారు.
ఇంగ్లండ్ను కొట్టాలంటే అది కావాల్సిందే.. సంజు శాంసన్పై గంభీర్ ప్రశంసల జల్లు!
ఇంగ్లండ్ లాంటి జట్టును ఓడించాలంటే అందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ విజయం సాధించిన నేపథ్యంలో గంభీర్ తమ తదుపరి మ్యాచ్ గురించి వివరాలను వెల్లడించారు.
శనకపై మలింగ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్ వద్ద హైడ్రామా! పాక్తో మ్యాచ్ తర్వాత అసలేం జరిగింది?
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ శనకపై ఆ జట్టు బౌలింగ్ కోచ్, మాజీ లంక ప్లేయర్ లసిత్ మలింగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెకెలెలో పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో చివరి ఓవర్లలో శనక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఓ దశలో శనక బాదుడుకు శ్రీలంక గెలుస్తుందని కూడా భావించారు.
ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్చి 26, 2026న ప్రారంభం అయి మే 31, 2026 వరకు జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా.. అంటే మార్చి 28, 2026న ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.
క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి రావడం యాదృచ్ఛికంగానే జరిగిందని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జితేష్ శర్మ అన్నారు.
శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు సెగలు వస్తున్నాయని, ఆటగాళ్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని శ్రీలంక టీ20ఐ జట్టు కెప్టెన్ దసున్ శనక కోరాడు.
వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ బంపర్ గిఫ్ట్.. రూ. 22 లక్షల కారు!
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22 లక్షల విలువ చేసే టాటా కర్వ్ కారును అతనికి టాటా మోటార్స్ బహుకరించింది. షోరూంలో వైభవ్ కారును ఆవిష్కరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
ఓటమి మంచిదే.. టీమిండియాపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను తెలుసుకుని ఇకపై అలా జరగకుండా చూసే అవకాశం లభించిందని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి అన్నారు.

















