వార్తలు
విజయ్ పార్టీ ఎఫెక్ట్: చెపాక్ స్టేడియంలో ఈలలపై నిషేధం.. పొలిటికల్ సెగ!
చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో ఈ నిర్ణయం అమలవుతోంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు స్టేడియంలోకి విజిల్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు.
పసుపు పాలు తాగుతున్నారా? డాక్టర్ పాల్ మాణికం సీరియస్ హెచ్చరిక!
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా ఇన్స్టాగ్రామ్ స్కిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఆయన పసుపు పానీయాల ప్రయోజనాలను విశ్లేషిస్తూ, పసుపు సప్లిమెంట్లపై మాత్రం స్పష్టమైన హెచ్చరిక చేశారు.
తెలంగాణకు అన్యాయం చేస్తే సహించం.. బీజేపీ, బీఆర్ఎస్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలకు ప్రజలు వేసే ఓట్లు వృథా అవుతాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్పై క్రేజీ అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం.
డీఆర్డీఓలో అప్రెంటిస్ కొలువులు.. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా వారికి ఛాన్స్!
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
చిలగడదుంపలతో జీర్ణక్రియ మెరుగు.. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కీలక సూచనలు!
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే వీటిని చాలా మంది స్నాక్స్ లాగా భావిస్తారు. కానీ ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
టీమ్ ఇండియాకు గంభీర్ స్పెషల్ డిన్నర్.. నమీబియాతో పోరుకు ముందు అదిరిపోయే ప్లాన్!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా తన తరువాతి మ్యాచ్లో నమీబియాతో తలపడనుంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు.
సూర్యతో దిల్ రాజు రిస్కీ ప్రాజెక్ట్.. ఫ్లాప్ డైరెక్టర్కు మరో ఛాన్స్!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా వార్తలు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సూర్య ఇన్నింగ్స్కు సెహ్వాగ్ ఫిదా.. టీమిండియా స్టార్పై ప్రశంసల జల్లు!
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ను మాజీ భారత ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలతో ముంచెత్తారు.

















