నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు రావ‌డానికి గ‌ల కార‌ణం అదేనా ?

September 23, 2021 2:04 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన అక్కినేని నాగచైతన్య, సమంతల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వీరి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ సమంత – చైతన్య ఈ విషయంపై స్పందించలేదు. సమంత పలు ట్వీట్స్ చేస్తూ ఈ విషయాల గురించి బయట పెడుతున్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో “S” అని పెట్టినప్పటినుంచి వీరి విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు నాగ చైతన్య, సమంతల మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు రావ‌డానికి గ‌ల కార‌ణం అదేనా ?

ఒక సాధారణ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన సమంతకు సినిమాలంటే ఎంతో ఇష్టం. సినిమాలపై ఉన్న ఇష్టతతో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఈ స్థాయికి చేరుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఏమాత్రం సినిమా అవకాశాలను వదులుకోకుండా ఎక్కువగా గ్లామరస్, స్కిన్ షో లను చేయడం అక్కినేని కుటుంబానికి నచ్చలేదు. సినిమాలు వదులుకొని అమల మాదిరిగా ఉండాలని అక్కినేని కుటుంబం సూచించడం తనకి నచ్చలేదు. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా సమంత నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్‌ 2” సిరీస్ లో రాజీ పాత్రలో సమంత ఎంతో బోల్డ్ గా నటించింది. ఇలా పెళ్లి తర్వాత సమంత స్కిన్ షో చేయడం నచ్చకపోవడంతో తన పద్ధతి మార్చుకోవాలని నాగచైతన్య సూచించాడు. అప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఈ విషయమే వీరి విడాకులకు దారి తీసిందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో హాజరు అయ్యారని, దీంతో వీరికి కౌన్సెలింగ్ ఇచ్చారని, అయినా కూడా వీరు విడాకులు తీసుకోవాలనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల తంతు పూర్తయిందని, మరొక రెండు, మూడు నెలలలో విడాకులు రాబోతున్నాయని, సమంతకి నాగచైతన్య తన స్థిర, చరాస్తులు మొత్తం రూ.50 కోట్ల వరకు భరణంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి ఇవే వార్తలు అనేక సైట్లలో వస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఈ వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now