విషాదం.. వాగు దాటుతుండగా చిన్నారులతో సహా తల్లి గల్లంతు..!

September 4, 2021 10:02 PM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడం చేత పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా మరికొందరు ఈ వరదనీటిలో కొట్టుకుపోతూ మరణిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా అధిక వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది అని చెప్పవచ్చు. అధిక వర్షం ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వాగు దాటుతుండగా ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులు వాగులో గల్లంతైన ఘటన చోటు చేసుకుంది.

విషాదం.. వాగు దాటుతుండగా చిన్నారులతో సహా తల్లి గల్లంతు..!

గత రెండు మూడు రోజుల నుంచి అధిక వర్షాలు కురవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన పిల్లలిద్దరినీ తీసుకొని రంపచోడవరంలో ఆధార్ ఈ-కేవైసీ ని పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో బడి గుంట – ఆకుర మధ్య వాగులో గల్లంతైంది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వాగు దాటుతూ ఉన్న గణేష్ దొర, వెట్టి వంశీ దొర అనే ఇద్దరు గిరిజన చిన్నారులు జారిపడి వాగులో గల్లంతయ్యారు.

ఈ క్రమంలోనే వారిని రక్షించబోయిన తల్లి కూడా అదే వాగులో కొట్టుకుపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా కేవలం ఒక అబ్బాయి మృతదేహం మాత్రమే లభించింది. మిగిలిన చిన్నారి, తల్లి కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now