Tollywood : టాలీవుడ్‌లో అత్య‌ధిక బ‌డ్జెట్ అయిన సినిమాలు ఇవి.. ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

July 11, 2022 9:59 PM

Tollywood : సాధార‌ణంగా ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు అంటే.. ఆరు పాట‌లు, రెండు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్‌.. ఇలా సాగేవి. కానీ రాజ‌మౌళి రాక‌తో తెలుగు సినిమాల‌కు అర్థ‌మే మారిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న సినిమాలు అంత‌ర్జాతీయ స్థాయిలో పేరుగాంచాయి. దీంతో ఆయ‌న ఎంతో ఖ్యాతిని గ‌డించ‌డ‌మే కాక‌.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తూ అల‌రిస్తున్నారు. బాహుబ‌లి 2 మూవీకి రూ.1900 కోట్లు వచ్చాయంటే రాజ‌మౌళి ప్ర‌తిభ ఎంత‌టిదో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

రూ.1000 కోట్ల‌ను ఒక సినిమా క‌లెక్ట్ చేస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. కానీ దాన్ని రాజ‌మౌళి చేసి చూపించారు. ఇక ఆయ‌న సినిమాల‌కు బ‌డ్జెట్ కూడా అధికంగానే అవుతుంటుంది. ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి సినిమా అంటే హిట్ ప‌క్కా క‌నుక నిర్మాతలు ఎంత మొత్త‌మైనా చెల్లించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక రాజమౌళి మాత్ర‌మే కాకుండా ఇత‌ర ద‌ర్శ‌కులు కూడా తెలుగులో భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక బ‌డ్జెట్ అయిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

these are the most budget movies in Tollywood
Tollywood

రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఈ సినిమాకు గాను రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అలాగే ప్రభాస్ తీస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాకు రూ.600 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ అవుతోంది. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ బ‌డ్జెట్ రూ.550 కోట్లు అయింది. పుష్ప సినిమా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల మనసును దోచుకుని హిట్ అయింది. పుష్ప 2 సినిమాకి గాను దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ అని అనుకుంటున్నారు.

ప్రభాస్ నటించిన సాహో సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాకు రూ.350 కోట్ల బడ్జెట్ అయింది. అలాగే రాధేశ్యామ్ కు రూ.300 కోట్లు, సైరా నరసింహా రెడ్డికి రూ.300 కోట్లు, బాహుబలి 2 కి రూ.250 కోట్లు బ‌డ్జెట్ అవ‌గా.. సలార్ కు రూ.200 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఇక పుష్ప మొద‌టి పార్ట్‌కు రూ.200 కోట్ల వ‌ర‌కు అయిన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now