Tollywood : టాలీవుడ్‌కి ఇదో కొత్త గండమా.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రికి ఎందుకిలా జ‌రుగుతోంది ?

October 5, 2021 2:15 PM

Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరోలకు వరుసగా యాక్సిడెంట్స్, షూటింగ్ లలో దెబ్బలు, పలు రకాల తీవ్రమైన జ్వరాలతో.. ఒకరి తర్వాత మరొకరు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇండస్ట్రీకి ఇదేమైనా శాపమా అనే అనుమానం రేకెత్తుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్ని వెంటాడుతున్న ఈ సమస్య ఏంటో అంటూ.. నెటిజన్లు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సరిగ్గా వినాయకచవితి నాడు బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలయిన సాయి తేజ్ స్పృహ కోల్పోయి మరీ హాస్పిటల్ చేరారు.

why tollywood heroes are admitting in hospitals

Tollywood : హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్

ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా తన ఆరోగ్యం బాగానే ఉంది.. తనను, తన సినిమాను ఆదరించినవారందరికీ థ్యాంక్స్ చెబుతూ, త్వరలోనే వచ్చేస్తానంటూ ఓ ఫోటోను సాయి ధరమ్ తేజ్ షేర్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ తో ప్లేట్ లెట్స్ డౌన్ అయ్యి రెండు వారాలుగా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్ ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇక్కడ అంతా క్షేమం.. అంటూ సన్ ఫ్లవర్ లుక్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత హీరో సిద్ధార్ధ్ కు కూడా మహాసముద్రం షూటింగ్ లో గాయాలు అయ్యాయి. సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. రెపో 19 సినిమా షూటింగ్ లో రామ్ పోతినేనికి సైతం మెడకు గాయం అవ్వడంతో ఇక ఈ విషయంలో అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏదైనా గండం ఉందా.. అంటూ రియాక్ట్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment