Viral Video : తేనె ఎంతో తియ్యగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకనే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తేనెను ఎంతో ఇష్టంగా తింటారు. ఆయుర్వేద వైద్యంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెతో పలు రకాల ఔషధాలను తయారు చేయవచ్చు. తేనెను రోజూ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే తేనెను ఎలా సేకరిస్తారో కూడా అందరికీ తెలిసిందే. తేనె పట్టు నుంచి తేనెను తీస్తారు.
తేనెటీగలను కొందరు ఫామ్లలో పెంచి అవి పెట్టే పట్టు నుంచి తేనెను సేకరించి దాన్ని విక్రయిస్తారు. ఇక మనకు అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చెట్లకు సహజసిద్ధంగా తేనెతెట్టెల నుంచి కూడా తేనె లభిస్తుంది. అయితే ఇలాగే ఒక వ్యక్తి తేనె సేకరించాడు. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం అందరికీ దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఎందుకంటే చుట్టూ తేనెటీగలు ఉన్నా కూడా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా ఆ వ్యక్తి ఎంతో చాకచక్యంగా తేనెను తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.
ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మను రెండుగా చీల్చగా అందులో తేనె తెట్టె కనిపించింది. దాన్నుంచి అతను తేనెను తీశాడు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ వ్యక్తి తేనె సేకరించడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. కానీ అతనికి అది అలవాటే అని ఆ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తేనెటీగలను డిస్టర్బ్ చేసి తేనెను ఎందుకు సేకరిస్తున్నావు.. అని కొందరు జంతు ప్రేమికులు కామెంట్స్ చేయగా.. అతను సమాధానం చెప్పాడు.
ఇది పరిశుద్ధమైన తేనె. నేను తేనెటీగలను చంపలేదు. అవి మళ్లీ తెట్టె పెట్టి జీవిస్తాయి. నేను వాటికి ఎలాంటి హాని కలగజేయలేదు.. అని రిప్లై ఇచ్చాడు. కాగా ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈ తేనె కావాలని కోరగా.. ఆ వ్యక్తి తన ఫోన్ నంబర్ను సైతం షేర్ చేయడం విశేషం.
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…