Gruha Pravesham : సొంత ఇంటిని కట్టుకోవాలని చాలా మందికి కల ఉంటుంది. అందుకోసమే చాలా మంది కష్టపడుతుంటారు. సొంతంగా ఇల్లు కాకపోయినా అపార్ట్మెంట్ అయినా తీసుకోవాలని చూస్తుంటారు. అయితే ఇల్లు లేదా అపార్ట్మెంట్ కట్టింది కొన్నా.. లేదా సొంతంగా కట్టించుకున్నా.. వాస్తుకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇంట్లో అన్నీ దోషాలే ఏర్పడుతాయి. దీంతో అలాంటి ఇంట్లో నివసించే వారు అన్నీ సమస్యలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీంతోపాటు కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేసే సమయంలోనూ కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఇంటిని కొత్తగా నిర్మిస్తున్నట్లే లేదా కట్టిన ఇంటిని తీసుకుంటే ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోండి. అలా వీలు కుదరకపోతే ఇంటి ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉండేలా చూడండి. దీంతో వాస్తు దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక గృహ ప్రవేశం చేసే వారు తగిన తేదీ, ముహుర్తాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కుటుంబ యజమాని జాతకంతో ముహుర్తం చూడాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ల పక్షంలోని గురువారం లేదా శుక్రవారం, ఆదివారం గృహ ప్రవేశం చేయడం చాలా మంచిదని చెబుతుంటారు. అయితే కచ్చితమైన సమయం లేదా ముహుర్తం కోసం పండితులను సంప్రదిస్తే మంచిది.
కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తరువాత పాలు పొంగిస్తారు. దీంతో ఆ ఇంట్లో సిరి సంపదలు, ధనధాన్యాలు తులతూగాలని కోరుకుంటారు. అలాగే కచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించాలి. దీని వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో ఉండబోయే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఇంటిని కొనే ముందు లేదా కట్టించేటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి వాస్తు సలహాలను తీసుకోవడం ఉత్తమం.
ఇక ఇంటి లోపల, బయట పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ ఆ ఇంటి మహిళలు ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఉండే వారిని అనుగ్రహిస్తుంది. దీంతోపాటు వాస్తు దోషాలు కూడా పోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. కనుక కొత్త ఇంట్లో చేరబోయే వారు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…