సాధారణంగా మనం గొర్రెల నుంచి తీసిన ఉన్నితో వివిధ రకాల బ్లాంకెట్స్, జర్కిన్లు, మఫ్లర్లు, స్కార్ఫ్ల వంటి వాటిని తయారుచేయడం గురించి విన్నాము. కానీ.. మీరెప్పుడైనా కుక్క బొచ్చుతో స్కార్ఫ్ ను తయారు చేయించడం విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మిషెల్ పార్కర్ అనే మహిళ తన పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకుంది.. అసలు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
మిషెల్ పార్కర్ అనే మహిళకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఈ మహిళ 2 పెంపుడు కుక్కలను పెంచుకుంటోంది. వాటి పేర్లను లూకా, కిషోన్డ్ గా పెట్టుకుని వాటిని ఎంతో అపురూపంగా చూసుకునేది. పెంపుడు కుక్కలు నిత్యం తన వెంటే ఉంటూ తన పట్ల ఎంతో ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శించేవి. అయితే పెంపుడు కుక్కలు మనం జీవించి ఉన్నంత కాలం ఉండవు. కనుక ఎప్పుడో ఒక రోజు ఆ కుక్కలు తనని వదిలి వెళ్లిపోతాయని, చనిపోతాయని భావించిన పార్కర్ వాటి గుర్తుగా తన దగ్గర ఏదైనా ఉండాలని భావించింది.
ఈ క్రమంలోనే ఫేస్ బుక్ లో ఒక వ్యక్తి పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకున్నాడని తెలియడంతో సదరు మహిళ కూడా ఎలాగైనా తను స్కార్ఫ్ చేయించుకోవాలని ఏకంగా 18 వేల రూపాయలను ఖర్చు చేసి తన రెండు పెంపుడు కుక్కలు నుంచి 525 గ్రాముల బొచ్చును తీసుకుని స్కార్ఫ్ తయారు చేయించుకుంది. ఈ విధంగా తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ స్కార్ఫ్ చేయించుకోవడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…