సాధారణంగా మనం గొర్రెల నుంచి తీసిన ఉన్నితో వివిధ రకాల బ్లాంకెట్స్, జర్కిన్లు, మఫ్లర్లు, స్కార్ఫ్ల వంటి వాటిని తయారుచేయడం గురించి విన్నాము. కానీ.. మీరెప్పుడైనా కుక్క బొచ్చుతో స్కార్ఫ్ ను తయారు చేయించడం విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మిషెల్ పార్కర్ అనే మహిళ తన పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకుంది.. అసలు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
మిషెల్ పార్కర్ అనే మహిళకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఈ మహిళ 2 పెంపుడు కుక్కలను పెంచుకుంటోంది. వాటి పేర్లను లూకా, కిషోన్డ్ గా పెట్టుకుని వాటిని ఎంతో అపురూపంగా చూసుకునేది. పెంపుడు కుక్కలు నిత్యం తన వెంటే ఉంటూ తన పట్ల ఎంతో ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శించేవి. అయితే పెంపుడు కుక్కలు మనం జీవించి ఉన్నంత కాలం ఉండవు. కనుక ఎప్పుడో ఒక రోజు ఆ కుక్కలు తనని వదిలి వెళ్లిపోతాయని, చనిపోతాయని భావించిన పార్కర్ వాటి గుర్తుగా తన దగ్గర ఏదైనా ఉండాలని భావించింది.
ఈ క్రమంలోనే ఫేస్ బుక్ లో ఒక వ్యక్తి పెంపుడు కుక్క బొచ్చుతో స్కార్ఫ్ చేయించుకున్నాడని తెలియడంతో సదరు మహిళ కూడా ఎలాగైనా తను స్కార్ఫ్ చేయించుకోవాలని ఏకంగా 18 వేల రూపాయలను ఖర్చు చేసి తన రెండు పెంపుడు కుక్కలు నుంచి 525 గ్రాముల బొచ్చును తీసుకుని స్కార్ఫ్ తయారు చేయించుకుంది. ఈ విధంగా తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ స్కార్ఫ్ చేయించుకోవడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…