మీ పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం కాలేదని.. పాన్ కార్డ్ – ఆధార్ అనుసంధానానికి గడువు ముగుస్తుందని టెన్షన్ పడుతున్నారా.. అయితే ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాన్ కార్డు – ఆధార్ అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీని ఆఖరి తేదీ ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.
ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలలో నగదు డిపాజిట్ చేయడం, డీమ్యాట్ ఖాతా తెరవడం వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్ తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు – ఆధార్ లింక్ తప్పని సరని తెలిపింది. ఇప్పటికే పాన్ కార్డు – ఆధార్ ను అనుసంధానం చేయడానికి ఎన్నోసార్లు గడువును పొడిగించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఈ గడువును మరో ఆరు నెలలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలందరికీ ఎంతో ఊరట కలిగింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…