మీ పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం కాలేదని.. పాన్ కార్డ్ – ఆధార్ అనుసంధానానికి గడువు ముగుస్తుందని టెన్షన్ పడుతున్నారా.. అయితే ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాన్ కార్డు – ఆధార్ అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీని ఆఖరి తేదీ ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.
ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలలో నగదు డిపాజిట్ చేయడం, డీమ్యాట్ ఖాతా తెరవడం వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్ తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు – ఆధార్ లింక్ తప్పని సరని తెలిపింది. ఇప్పటికే పాన్ కార్డు – ఆధార్ ను అనుసంధానం చేయడానికి ఎన్నోసార్లు గడువును పొడిగించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఈ గడువును మరో ఆరు నెలలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలందరికీ ఎంతో ఊరట కలిగింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…