వైరల్: ప్రాణాలు పోతున్నా ఏనుగు నుంచి కుటుంబాన్ని కాపాడిన కుక్క!

August 27, 2021 11:37 AM

అన్నం పెట్టిన వాళ్లను మనిషి గుర్తు చేసుకుంటాడో లేదో కానీ అన్నం పెట్టిన కుక్క మాత్రం విశ్వాసం చూపిస్తుంది. మనం పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్క ముఖ్యమైనది. ఎందుకంటే ఇతరుల నుండి రక్షణగా యజమానికి తోడుగా ఉంటుంది. ఎవరైనా తమ యజమానులపై దాడి చేస్తే అసలు ఊరుకోదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఏనుగు నుంచి ఒక కుటుంబాన్ని వారి పెంపుడు కుక్క కాపాడింది.

కేరళలోని ఇడుక్కి జిల్లా కందులూరుకి చెందిన ఓ కుటుంబం తమ రక్షణ కోసం టామీ అనే ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటోంది. మంగళవారం  సమీపంలో ఉన్న అడవి నుంచి దారి తప్పిన ఓ ఏనుగు వారి ఇంటి దగ్గరికి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యుల వైపు ఆ ఏనుగు పరుగులు పెట్టింది. అయితే టామీ వెంటనే ఆ ఏనుగు దగ్గరికి వచ్చి దాని కాళ్ళను కరిచింది.

ఆ ఏనుగు తిరిగి టామీపై దాడి చేస్తూ తన దంతాలతో టామీ కడుపులో పొడిచింది. ఇక టామీ పరిస్థితి ప్రాణాలు పోయే వరకు వచ్చింది. అయినా తన యజమాని కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తిరిగి ఏనుగుపై మళ్లీ దాడి చేసింది. ఏనుగు కళ్ళను తన కాళ్లతో గుచ్చడంతో వెంటనే ఏనుగు అక్కడి నుంచి పారిపోయింది. దీంతో టామీకి హాస్పిటల్ లో చికిత్స అందించారు. అయితే అది బుధవారం మరణించింది. దీంతో దాని యజమాని కుటుంబం కన్నీరు మున్నీరైంది. ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు కూడా కుక్క చూపించిన విశ్వాసాన్ని మెచ్చుకుంటూ దాని ప్రాణాలు పోయాయని బాధపడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment