సమాజంలో మంచి చేద్దామని కొందరు ప్రయత్నిస్తుంటారు. కానీ వారికి కొన్ని సందర్భాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. ఇక కొందరికైతే ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. తాజాగా ఓ యువతికి కూడా ఇలాగే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో అందరికీ మాస్కుల పట్ల అవగాహన కల్పించాలని ఆమె ఒక పనిచేసింది. కానీ అది బెడిసికొట్టింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో బిజీగా ఉన్న రోడ్డు కూడలిలో సడెన్ గా ఓ వైపు రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ఓ యువతి అక్కడకు వచ్చి జీబ్రా క్రాసింగ్ మీద డ్యాన్స్ లు చేయడం మొదలు పెట్టింది. అయితే ఆమె ట్రాఫిక్ గైడ్గా అక్కడ పనిచేస్తూ అందరినీ అలా ఎంటర్టైన్ చేస్తుందని అక్కడి వాహనదారులు భావించారు. కానీ ఆమె అక్కడ డ్యాన్స్ చేసింది వేరే విషయం కోసం.
ఆమె పేరు శ్రేయా కాల్రా. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చాటి చెబుతూ ఆమె అలా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్యాన్స్ చేసింది. అయితే పోలీసులు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె తరువాత ఇదే విషయంపై స్పందిస్తూ.. తాను ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడలేదని, రెడ్ సిగ్నల్ పడి ఉన్నప్పుడే డ్యాన్స్ చేశానని, గ్రీన్ సిగ్నల్ పడగానే తప్పుకున్నానని తెలిపింది. మాస్కులను ధరించాలని అవగాహన కల్పించడం కోసమే అలా డ్యాన్స్ చేశానని తెలిపింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఏది ఏమైనా ఆమె ఒక మంచి పని చేద్దామని ప్రయత్నించింది. కానీ అది అలా బెడిసికొట్టింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…