కరోనా వైరస్ ముందుగా ఎక్కడ ఉద్భవించింది.. అని అడిగితే అందుకు ఎవరైనా సరే.. చైనా అనే సమాధానం చెబుతారు. ఈ విషయం ఒకటవ తరగతి చదివే పిల్లలకు కూడా తెలుస్తుంది. అయితే అంతటి భారీ స్థాయిలో అక్కడ కేసులు వచ్చినా ఉన్నట్లుండి సడెన్ గా కేసులు ఎందుకు సున్నా అయ్యాయి ? అసలు కోవిడ్ ను చైనా ఎలా కట్టడి చేయగలిగింది ? వంటి ప్రశ్నలన్నీ ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.
ఇక తాజాగా మరోమారు చైనాలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర దేశాల్లాగే అక్కడ కూడా డెల్టా వేరియెంట్ పంజా విసురుతోంది. అయితే కరోనా ఉన్నప్పటికీ చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి యథేచ్చగా తిరుగుతున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. దీంతో చైనాతోపాటు తైవాన్లోనూ అనేక ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు.
కోవిడ్ వచ్చిన వారిని చైనా, తైవాన్ లలో ఇళ్లలోనే బంధిస్తున్నారు. సిబ్బంది పీపీఈ కిట్లను ధరించి వచ్చి కోవిడ్ బాధితుల ఇళ్లను మూసేస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం తెరవకుండా బయట మేకులు కొడుతున్నారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…