కొన్నిసార్లు కొంతమందికి అదృష్టం సుడి తిరిగినట్టు తిరుగుతుంటుంది. ఇలా అదృష్టం పట్టినప్పుడు వారికి తెలియకుండానే లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇలాంటి అదృష్టం తాజాగా ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. విచిత్రమేమిటంటే ఎక్కడైతే తను తప్పతాగి పడిపోయాడో ఆ బార్ నుంచి ఏకంగా రూ.40 కోట్ల నష్టపరిహారాన్ని రాబట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..
2019 మే నెలలో టెక్సాస్కు చెందిన డానియల్ రాల్స్ అనే వ్యక్తి ఒక రోజు ఆండ్రూస్లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్గా తాగాడు. తాగిన మత్తులో ఆ వ్యక్తి కార్ పార్కింగ్ వద్ద మరో వ్యక్తితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే డానియల్ తలకు తీవ్రంగా గాయమైంది. ఈ విధంగా గాయపడిన డానియల్ ఆస్పత్రిలో చేరి చికిత్స అనంతరం సదరు బార్ అండ్ రెస్టారెంట్ పై కోర్టులో కేసు వేశాడు. కేవలం ఆ రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ విధమైనటువంటి గాయం తగిలిందని ఆరోపించాడు.
రెస్టారెంట్ సిబ్బంది తనకు అధికమొత్తంలో మందు తాపించి ఈ గొడవకు కారణం అయ్యారని, గొడవ పడుతున్న సమయంలో రెస్టారెంట్ యాజమాన్యం ఏ విధంగానూ స్పందించకపోవడమేకాకుండా, తలకు గాయంతో బాధపడుతుంటే అంబులెన్స్ కు కూడా ఫోన్ చేయలేదని ఆరోపించాడు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ యాజమాన్యం కూడా న్యాయవాదులను పెట్టి కోర్టులో వాదించినప్పటికీ కోర్టు మాత్రం డానియల్ కి అండగా నిలబడింది. ఈ క్రమంలోనే సదరు బార్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించిన కారణంగా డానియల్ కు ఐదు మిలియన్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ విధంగా తీర్పు రావడంతో డానియల్ దశ మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు లక్ష్మీ పుత్రుడు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…