సాధారణంగా ప్రతి మనిషికి 32 దంతాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.కానీ బీహార్ కి చెందిన ఓ కుర్రాడికి మాత్రం నోరంతా దంతాలు కలిగి ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ కుర్రాడికి 32 దంతాలకు బదులుగా ఏకంగా 82 దంతాలు ఉండడంతో ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.బీహార్లోని పాట్నాలో నివసిస్తున్న 17 ఏళ్ల టీనేజర్ నితీష్ కుమార్ ఒక అరుదైన సమస్యతో బాధ పడటం వల్లే దంతాలు అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ విధంగా దంతాలు ఎక్కువగా రావటాన్ని వైద్యపరిభాషలో ‘ఓడోంటోమా’ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా నోటి నిండా పళ్ళు ఉండటంతో ఆ కుర్రాడికి మాట్లాడటానికి నోరు మెదప డానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అదేవిధంగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ విధంగా నితీష్ కుమార్ కి పుట్టుకతో ఇన్ని పళ్ళు రాలేదని, గత ఐదు సంవత్సరాల నుంచి నోటిలో కణతులు ఏర్పడి వాటి నుంచి దంతాలు వచ్చాయని తెలిపారు.అయితే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఇన్ని రోజులు చికిత్స చేయించుకోలేదని ప్రస్తుతం నొప్పి అధికమవడంతో నితీష్ ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులను సంప్రదించాడు. ఇతని సమస్య చూసిన వైద్యులు సైతం ఎంతో ఆశ్చర్యానికి గురి అయినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే వైద్యులు అతనికి సుమారు మూడు గంటల పాటు చికిత్స చేసి దంతాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఇతడి నోటిలో ఏర్పడిన దంతాలకు సంబంధించిన ఎక్స్రే చిత్రాలను ఈ కింద చూడగలరు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…