సాధారణంగా ప్రతి మనిషికి 32 దంతాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.కానీ బీహార్ కి చెందిన ఓ కుర్రాడికి మాత్రం నోరంతా దంతాలు కలిగి ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ కుర్రాడికి 32 దంతాలకు బదులుగా ఏకంగా 82 దంతాలు ఉండడంతో ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.బీహార్లోని పాట్నాలో నివసిస్తున్న 17 ఏళ్ల టీనేజర్ నితీష్ కుమార్ ఒక అరుదైన సమస్యతో బాధ పడటం వల్లే దంతాలు అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ విధంగా దంతాలు ఎక్కువగా రావటాన్ని వైద్యపరిభాషలో ‘ఓడోంటోమా’ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా నోటి నిండా పళ్ళు ఉండటంతో ఆ కుర్రాడికి మాట్లాడటానికి నోరు మెదప డానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అదేవిధంగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ విధంగా నితీష్ కుమార్ కి పుట్టుకతో ఇన్ని పళ్ళు రాలేదని, గత ఐదు సంవత్సరాల నుంచి నోటిలో కణతులు ఏర్పడి వాటి నుంచి దంతాలు వచ్చాయని తెలిపారు.అయితే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఇన్ని రోజులు చికిత్స చేయించుకోలేదని ప్రస్తుతం నొప్పి అధికమవడంతో నితీష్ ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులను సంప్రదించాడు. ఇతని సమస్య చూసిన వైద్యులు సైతం ఎంతో ఆశ్చర్యానికి గురి అయినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే వైద్యులు అతనికి సుమారు మూడు గంటల పాటు చికిత్స చేసి దంతాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఇతడి నోటిలో ఏర్పడిన దంతాలకు సంబంధించిన ఎక్స్రే చిత్రాలను ఈ కింద చూడగలరు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…