Tulsi Plant : హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లో తులసి ఉందంటే లక్ష్మీదేవి ఉన్నట్టే భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ పూజిస్తూ ఉంటారు కూడా. తులసి మొక్క పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది. కనుక తులసి మొక్క ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతుంది. అటువంటి సమయంలో తులసి మొక్కను తొలగించేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. లేదంటే మీరు అనుసరించే పద్దతులు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. తులసి మొక్క ఎండిన తరువాత ఏం చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచకూడదు. హిందు మతం ప్రకారం ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారో తులసి మొక్క ఎండిపోవడాన్ని కూడా అంతే అశుభంగా భావిస్తారు. అలాంటి మొక్క ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. వెంటనే తొలగించాలి. లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఎండిపోయిన తులసి మొక్క స్థానంలో పచ్చగా ఉండే మరో మొక్కను నాటాలి. ఎండిన తులసి మొక్కను కాల్చకూడదు. అలాగే దాన్ని విసిరివేయకూడదు. అలా చేయడం అశుభం. ఎండిన తులసి మొక్కను భూమిలో పాతిపెట్టడం మంచిది. అలాగే ఇంట్లో తులసి మొక్కను నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట తులసి ఆకులు కోయకూడదు. అలాగే ఆదివారం, ఏకాదశి తిథిలో కూడా తులసి ఆకులు కోయకూడదు. తులసి ఆకులు తొక్కకూడదు. తులసిని లక్ష్మీ దేవిలాగా భావిస్తారు. కనుక నేలపై పడిన తులసి ఆకులను మట్టిలో పాతిపెట్టాలి.
వాటిని తొక్కడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుంది. తులసి కోటను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి మొక్క పవిత్రమైనది కనుక దీనిని కుండీలో ఎత్తుగా ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. ప్రతిరోజూ పూజలు చేస్తూ దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…