Left Over Rice Vada : మనం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడు వడలను తయారు చేస్తూ ఉంటాము. వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే తరచూ ఒకేరకంగా కాకుండా మనం అన్నంతో కూడా వడలను తయారు చేసుకోవచ్చు. అన్నంతో చేసే ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే వీటిని ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు, ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈవడలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ రైస్ వడలను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై సరిపడా.
ముందుగా జార్ లో అన్నం, రవ్వ, పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో వంటసోడా, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. పిండి నానిన తరువాత ఇందులో వంటసోడా వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి వడ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతులకు నీటితో తడి చేసుకుంటూ పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ వడలు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో మనం అన్నంతో రుచిగా వడలను తయారు చేసుకుని తినవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…