Shivalayam : హిందువులు శివున్ని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. శివుని శివలింగం రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. అలాగే శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ. అయితే శివుడిని మాత్రం చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈవిభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు. మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. విభూదిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెప్తున్నారు. అలాగే శిలింగానికి కుంకుమబొట్టు పెట్టకూడదు. కేవలం విభూదిని మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి.
అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు. సోమవారం నాడు శివుడు కైలాసం నుండి నేరుగా భూమి పైకి వస్తాడని ప్రతిదీ. కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయడంతో పాటు బెల్లం ముక్కను నైవేధ్యంగా సమర్పించాలి. సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. కనుక సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడని ప్రతీతి. అలాగే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షణ మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవుపాలతో మాత్రమే ఉపయోగించాలి. ప్రతి సోమవారం ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. చాలా మంది పాలను ప్యాకెట్ లో ఉంచి అలాగే అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. పాలను గ్లాసులోకి తీసుకుని ఆ తరువాత అభిషేకం చేయాలి.
అలాగే అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని ఉపయోగించకూడదు. శివలింగంపై పాలు పోసిన తరువాత నీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు స్టీల్ స్టాండ్ ను ఉపయోగించకూడదు. మన శరీరంపై ఉండే చెమట గానీ, వెంట్రుకలు గానీ శివుడిపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే జలదార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తెలుపు రంగులో ఉండే పాలరాతి శివలింగాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోకూడదు. ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఏర్పాటు చేసుకోకూడదు. శివున్ని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నందివర్దన పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. పారిజాత పూలను శివునికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేయకూడదు. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. శివుడికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. పౌర్ణమి నాడు శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని శాస్త్రం చెబుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…