Paneer Masala Curry : మనం పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటుగా వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పనీర్ తో చేసే వంటకాల్లో పనీర్ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అయితే దీనిని తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఎవరైనా అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా, సులభంగా పనీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ ఆనియన్స్ – ఒక కప్పు, పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి రెమ్మలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, జీడిపప్పు – 10 నుండి 12, పనీర్ – 200గ్రా., పెరుగు – పావు కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం పొడి – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, పనీర్ మసాలా పొడి – ఒక టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ముందుగా జార్ లో బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, జీడిపప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పనీర్ ను ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, పసుపు, పనీర్ మసాలా వేసి కలపాలి. తరువాత దీనిని 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న పనీర్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కసూరిమెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని జీరా రైస్, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా, రుచిగా పనీర్ మసాలా కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…