Paneer Masala Curry : మనం పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటుగా వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పనీర్ తో చేసే వంటకాల్లో పనీర్ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అయితే దీనిని తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఎవరైనా అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా, సులభంగా పనీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ ఆనియన్స్ – ఒక కప్పు, పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి రెమ్మలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, జీడిపప్పు – 10 నుండి 12, పనీర్ – 200గ్రా., పెరుగు – పావు కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం పొడి – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, పనీర్ మసాలా పొడి – ఒక టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ముందుగా జార్ లో బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, జీడిపప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పనీర్ ను ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, పసుపు, పనీర్ మసాలా వేసి కలపాలి. తరువాత దీనిని 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న పనీర్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కసూరిమెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని జీరా రైస్, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా, రుచిగా పనీర్ మసాలా కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…