పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు. అందులో మనుషులకు ఎలాంటి మినహాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒక సారి చనిపోవాల్సిందే. కాకపోతే కొందరు అర్థాంతరంగా తనువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎవరికైనా సరే ఆయువు ఉన్నంత వరకే జీవిస్తారు. అది ముగిస్తే యముడు పాశం వేసి ప్రాణాలను తీస్తాడు. అయితే మరి ఆయువు తీరింది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయువు తీరిందని చెప్పేందుకు మన శరీరంలో పలు సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శక్తి స్థాయిలు పూర్తిగా తగ్గిపోతాయి. పనిచేసేందుకు అసలు ఏమాత్రం శక్తి ఉండదు. తీవ్రమైన నీరసం, అలసట ఉంటాయి. శరీరం అంటేనే భారంగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బరువు దించుకుందామా.. అన్నట్లుగా ఉంటుంది. మరణం సమీపిస్తుంటే బీపీ, హార్ట్ రేట్, శ్వాస క్రియ సక్రమంగా ఉండవు. అసాధారణ రీతిలో ఉంటాయి. పూర్తిగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అలాగే ఉష్ణోగ్రత కూడా క్షణ క్షణానికి మారుతుంటుంది.
మరణం సమీపిస్తుంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే గొంతులో నుంచి జీర లాంటి ఒక ధ్వని వినిపిస్తుంది. ఇది వచ్చిందంటే ఆ మనిషి కొన్ని గంటల్లోనే చనిపోతాడని అర్థం. మృత్యువు సమీపిస్తుంటే మనిషి మానసిక స్థితి దెబ్బ తింటుంది. సరిగ్గా ఆలోచించలేడు. ఒక రకమైన ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఎంతో దగ్గరి వారు, కుటుంబ సభ్యులు, అత్యంత చనువుగా ఉండే వారిని సైతం గుర్తు పట్టలేకపోతుంటారు. చావు సమీపిస్తుంటే ఆకలి ఉండదు. దాహం అనిపించదు. దీంతో బరువు తీవ్రంగా తగ్గిపోతారు. చావు సమీపిస్తుంటే చర్మం రంగు, ఉష్ణోగ్రత మారుతాయి. చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. కళ ఉండదు. ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది.
చావు సమీపించిన వారు ఎల్లప్పుడూ కోమాలో ఉన్నట్లు ఉంటారు. కళ్లు తెరిచి చూడలేరు. అలాగే తమకు యమ ధర్మ రాజు, యమ భటులు, చనిపోయిన వారు కనిపిస్తున్నారని చెబుతారు. ఇలా ఆయువు తీరిన వారికి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. దీన్ని బట్టి ఆయుష్షు తీరిందని వారు త్వరలోనే చనిపోతారని అర్థం చేసుకోవాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…