Leg Cramps : పిక్కలు పట్టేయడం.. దీనినే కాఫ్ పెయిన్ అని కూడా అంటారు. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. రాత్రి సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిక్కలు పట్టేయడానికి వివిధ కారణాలు ఉంటాయి. నీటిని తక్కువగా తాగడం, శరీరంలో ఎలక్ట్రోలైట్ ల అసమతుల్యతల వల్ల పిక్కల్లో కండరాలు సంకోచించి నొప్పిని కలిగిస్తాయి. అలాగే విటమిన్ డి , విటమిన్ బి 12, విటమిన్ ఇ వంటి విటమిన్ లోపాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే వెన్నుపూస నరాలపై ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అదే విధంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తసరఫరా తగ్గినప్పుడు అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయినప్పుడు కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి.
గర్భిణీ స్త్రీలల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో, ధూమపానం చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే కొందరిలో వ్యాయామాలు చేసేటప్పుడు కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. కాలి మడమలో వాపు వల్ల కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అయితే కొందరిలో అప్పుడప్పుడూ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. కానీ కొందరు తరచూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వైద్యున్ని సంప్రదించాలి. ఒకవేళ పిక్కలు పట్టేయడంతో పాటు తీవ్రమైన నొప్పి, జ్వరం, ఆ భాగంలో నొప్పి రావడం, అదే విధంగా పాదం మరియు కాలి రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే మన శరీరంలో ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా భావించాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. అయితే పిక్కలు పట్టేయడం అనేది సర్వసాధారణమైన సమస్యే అని ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
ముందుగా సమస్య తలెత్తడానికి గల కారణాలు తెలుసుకోవాలి. దీని వల్ల చికిత్స సులభతరం అవుతుంది. పిక్కలు పట్టేసినప్పుడు కదలకుడా ఒకే చోట కూర్చోకుండా కొద్దిగా నడవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. ఉప్పు కలిపిన నీటిని లేదా ఒ ఆర్ ఎస్ కలిపిన నీటిని తాగాలి. అలాగే వేడి నీటి ప్యాక్ ను నొప్పికలిగే చోట ఉంచడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా శరీరంలో విటమిన్ డి, బి12, ఇ లోపాలు లేకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే వ్యాయామాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం చాలా సులభంగా పిక్కలు పట్టేయడం అనే సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…