Kiwi Fruit : ప్రకృతి మనకు అనేక రకాల పండ్లను అందిస్తుంది. ప్రకృతి మనకు అందించే పండ్లల్లో కివీ పండు కూడా ఒకటి. ఈ పండ్లను మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తాయి. దాదాపు అన్ని కాలల్లోను ఇవి లభిస్తున్నాయి. ఈ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఇతర పండ్ల వలె కివీ పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కివీ పండ్లను తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. హై బీపీ మరియు లోబీపీలతో బాధపడే వారు రోజు 3 కివీ పండ్లను తినడం వల్ల బీపీ 20 శాతం తగ్గు ముఖం పడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. 150 మందికి 8 వారాల పాటు రోజుకు 3 కివీ పండ్లను ఇచ్చి జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడడయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
నేటి తరుణంలో చిన్న వయసులోనే చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. అధిక బరువు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత చాలా మంది రక్తపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. కనుక మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా మనం కివీ పండ్లను తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే రోజుకు 3 లేదా 4 కివీ పండ్లను 8 వారాల పాటు తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు చెడు కొలెస్ట్రాల్, రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ కూడా 30 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా నిరూపించారు. ఇవే కాకుండా ఈ పండ్లను తీసుకోవడం వల్ల పొట్టలో, ప్రేగుల్లో అల్సర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
100 గ్రాముల కివీ పండ్లల్లో 61 క్యాలరీల శక్తి, 83 శాతం నీరు, 93 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే ఈ పండ్లల్లో ఎఇఎసి అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది విటమిన్ సితో కలిసి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. ఈ కివీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం నుండి మలినాలు తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ విధంగా కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…