Kiwi Fruit : ప్రకృతి మనకు అనేక రకాల పండ్లను అందిస్తుంది. ప్రకృతి మనకు అందించే పండ్లల్లో కివీ పండు కూడా ఒకటి. ఈ పండ్లను మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తాయి. దాదాపు అన్ని కాలల్లోను ఇవి లభిస్తున్నాయి. ఈ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఇతర పండ్ల వలె కివీ పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కివీ పండ్లను తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. హై బీపీ మరియు లోబీపీలతో బాధపడే వారు రోజు 3 కివీ పండ్లను తినడం వల్ల బీపీ 20 శాతం తగ్గు ముఖం పడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. 150 మందికి 8 వారాల పాటు రోజుకు 3 కివీ పండ్లను ఇచ్చి జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడడయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
నేటి తరుణంలో చిన్న వయసులోనే చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. అధిక బరువు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత చాలా మంది రక్తపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. కనుక మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా మనం కివీ పండ్లను తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే రోజుకు 3 లేదా 4 కివీ పండ్లను 8 వారాల పాటు తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు చెడు కొలెస్ట్రాల్, రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ కూడా 30 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా నిరూపించారు. ఇవే కాకుండా ఈ పండ్లను తీసుకోవడం వల్ల పొట్టలో, ప్రేగుల్లో అల్సర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
100 గ్రాముల కివీ పండ్లల్లో 61 క్యాలరీల శక్తి, 83 శాతం నీరు, 93 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే ఈ పండ్లల్లో ఎఇఎసి అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది విటమిన్ సితో కలిసి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. ఈ కివీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం నుండి మలినాలు తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ విధంగా కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…