Ashwathama : మహాభారతం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీని గురించి మనం చిన్నతనం నుండే చదువుకుంటున్నాం. ఇప్పటికీ మహాభారతం అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. 90లలో దూరదర్శన్లో ప్రతి ఆదివారం వచ్చే మహాభారత్ సీరియల్ ను కొన్ని కోట్ల మంది చూశారు. అయితే మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉంటాయి. కానీ వాటిల్లో అశ్వత్థామ పాత్రకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.
అశ్వత్థామ ఎవరో తెలుసు కదా.. ద్రోణాచార్యుడి కుమారుడు. ద్రోణుడు కురు వంశానికి రాజగురువు. ఆయన పాండవులు, కౌరవులకు ఎన్నో విద్యలు నేర్పించాడు. అర్జునున్ని ఎంతో గొప్ప విలువిద్యకారుడిగా తీర్చిదిద్దాడు. అయితే ద్రోణుడు, ఆయన కుమారుడు అశ్వత్థామ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేస్తారు. చివరకు ఓడిపోతారు. అయితే ఎన్నో వేల ఏళ్ల కిందట ఈ యుద్ధం జరగ్గా అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు.
కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ ద్రౌపది కుమారులు 5 మందిని నిద్రలోనే హతమారుస్తాడు. వారిని ఉప పాండవులు అంటారు. అయితే ఇంతటి పాపానికి ఒడిగట్టిన అశ్వత్థామకు కృష్ణుడు శాపం పెడతాడు. భూమి ఉన్నంత వరకు చావు కోసం ఎదురు చూస్తూ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ దిక్కు లేకుండా అరణ్యాల్లో సంచరించు.. అని కృష్ణుడు.. అశ్వత్థామకు శాపం ఇస్తాడు. దీంతో అప్పటి నుంచి అశ్వత్థామ ఇప్పటి వరకు ఇంకా జీవించే ఉన్నాడని చెబుతుంటారు. అయితే అశ్వత్థామ ఇంకా ఉన్నాడని కానీ.. ఆయన ఎక్కడైనా కనిపించాడని కానీ.. చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు.
అయితే అశ్వత్థామ వద్ద ఒక మణి ఉందట. దాని వల్లే ఆయనకు మరణం ఉండదని.. ఎప్పటికీ మృత్యుంజయుడిగా ఉంటాడని చెబుతారు. అయితే అప్పట్లో హిమాలయాల్లో హనుమంతుడు కనిపించాడని కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ అశ్వత్థామకు చెందిన అలాంటి వార్తలేవీ రాలేదు. అయితే పురాణాల ప్రకారం మాత్రం అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడని అంటుంటారు. అరణ్యాల్లో తిరుగుతుంటాడని చెబుతారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…