Morning : ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం పాటించే విషయాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం దేనినైతే మొదట చూస్తామో దాని ప్రభావం మనకు రోజంతా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు. పెద్దలైతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోని చూసి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని నిద్ర లేవమని చెప్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేచాక చాలామంది ఏదో ఒక వస్తువుని అలా కాసేపు చూస్తూ ఉంటారు. లేదంటే దేవుడి ఫోటోని చూస్తూ ఉంటారు.
కొంతమంది చేతికి ఉన్న ఉంగరాలని చూసి లేస్తూ ఉంటారు. కొందరైతే వాళ్ళ ముఖాలని వాళ్ళే చూసుకుని నిద్రలేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఉంటే మాత్రం దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా చాలా మంది కాఫీ, టీ లను తాగుతూ ఉంటారు. అది మంచిది కాదు. అదే విధంగా దంతాలని శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవడం మంచిదట. కొంతమంది తిరుగుతూ పళ్ళు తోముకుంటారు. కొందరు ఎండ తగలాలని ఎండలో నిలబడి దంతాలని శుభ్రం చేసుకుంటుంటారు.
ఇలా చేయడం వలన సూర్యుడికి ఆగ్రహం కలుగుతుంది. డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుందని పండితులు అంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా చెడు కలిగితే ఈరోజు మనం ఎవరి మొహం మొదట చూశాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఉదయం లేచాక బొట్టు లేని ఆడపిల్ల ముఖం అస్సలు చూడకూడదు. అదేవిధంగా స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి వంటింట్లోకి వెళ్లకూడదు. స్త్రీలు ఉదయాన్నే శుభ్రం చేయని పాత్రలని చూడకూడదు. ఉదయం లేవగానే జంతువుల బొమ్మల్ని చూడడం కూడా మంచిది కాదు.
నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి. మనం చేసే పాపాలు అన్నింటినీ భూదేవి మోస్తుంది. కనుక నిద్ర లేవగానే వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోండి. నిద్రలేచిన వెంటనే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడడం చాలా మంచిది. దేవతలు కొలువై ఉండే గోవుని, తులసి మొక్కని నిద్రలేవగానే చూస్తే మంచి జరుగుతుంది. గుడి గోపురాన్ని, పర్వతాలని, సముద్రాన్ని చూస్తే కూడా అంతా శుభం కలుగుతుంది. బంగారాన్ని, దూడతో ఉన్న ఆవుని, ఎర్రచందనాన్ని చూసినా కూడా చక్కటి ఫలితం కనపడుతుంది. అగ్నిని చూసినా, యజ్ఞం చేసే వాళ్ళని చూసినా కూడా శుభమే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…