Morning : ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం పాటించే విషయాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం దేనినైతే మొదట చూస్తామో దాని ప్రభావం మనకు రోజంతా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు. పెద్దలైతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోని చూసి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని నిద్ర లేవమని చెప్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేచాక చాలామంది ఏదో ఒక వస్తువుని అలా కాసేపు చూస్తూ ఉంటారు. లేదంటే దేవుడి ఫోటోని చూస్తూ ఉంటారు.
కొంతమంది చేతికి ఉన్న ఉంగరాలని చూసి లేస్తూ ఉంటారు. కొందరైతే వాళ్ళ ముఖాలని వాళ్ళే చూసుకుని నిద్రలేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు ఉంటే మాత్రం దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా చాలా మంది కాఫీ, టీ లను తాగుతూ ఉంటారు. అది మంచిది కాదు. అదే విధంగా దంతాలని శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవడం మంచిదట. కొంతమంది తిరుగుతూ పళ్ళు తోముకుంటారు. కొందరు ఎండ తగలాలని ఎండలో నిలబడి దంతాలని శుభ్రం చేసుకుంటుంటారు.
ఇలా చేయడం వలన సూర్యుడికి ఆగ్రహం కలుగుతుంది. డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుందని పండితులు అంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా చెడు కలిగితే ఈరోజు మనం ఎవరి మొహం మొదట చూశాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఉదయం లేచాక బొట్టు లేని ఆడపిల్ల ముఖం అస్సలు చూడకూడదు. అదేవిధంగా స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి వంటింట్లోకి వెళ్లకూడదు. స్త్రీలు ఉదయాన్నే శుభ్రం చేయని పాత్రలని చూడకూడదు. ఉదయం లేవగానే జంతువుల బొమ్మల్ని చూడడం కూడా మంచిది కాదు.
నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి. మనం చేసే పాపాలు అన్నింటినీ భూదేవి మోస్తుంది. కనుక నిద్ర లేవగానే వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోండి. నిద్రలేచిన వెంటనే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడడం చాలా మంచిది. దేవతలు కొలువై ఉండే గోవుని, తులసి మొక్కని నిద్రలేవగానే చూస్తే మంచి జరుగుతుంది. గుడి గోపురాన్ని, పర్వతాలని, సముద్రాన్ని చూస్తే కూడా అంతా శుభం కలుగుతుంది. బంగారాన్ని, దూడతో ఉన్న ఆవుని, ఎర్రచందనాన్ని చూసినా కూడా చక్కటి ఫలితం కనపడుతుంది. అగ్నిని చూసినా, యజ్ఞం చేసే వాళ్ళని చూసినా కూడా శుభమే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…