Chapati : చాలా మంది రాత్రి పూట చపాతీలని ఎక్కువగా తింటూ ఉంటారు. అలానే మనం అల్పాహారం సమయంలో కూడా చపాతీలను చేసుకుని, తింటూ ఉంటాం. అయితే ఏదైనా ఆహార పదార్థాలని వండేటప్పుడు వృధా చేయకూడదని భావించి ఎంత మంది ఉన్నారో చూసుకుని వండుకుంటూ ఉంటాము. చపాతీలను చేసేటప్పుడు కూడా ఎవరు ఎన్ని చపాతీలు తింటారో చూసి వాళ్లకి కావాల్సిన అన్ని చపాతీలు చేస్తూ ఉంటాము.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చపాతీలను ఎవరినీ అడిగి లెక్కపెట్టకూడదు. ఎవరు ఎన్ని చపాతీలు తింటారు అని అడగడం మంచిది కాదు. ఎప్పుడైనా కూడా ఎన్ని తింటారు అని ఎవరిని అడక్కూడదు. అది మీపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. గోధుమ ధాన్యాలు సూర్యభగవానుడితో ముడిపడి ఉండడం వలన చపాతీలను చేసేటప్పుడు వాటిని లెక్కించకూడదని అంటారు.
ఒకవేళ కనుక ఎక్కువగా లెక్కించినట్లయితే సూర్య భగవానుడిని అవమానించినట్లు. ఇలా చేయడం వలన జాతకంలో సూర్యుడు బలహీనమవుతాడు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండవని వాస్తు శాస్త్రం అంటోంది. అలానే చాలామంది ఈరోజు చపాతీ పిండి మిగిలిపోయింది అని ఫ్రిజ్లో పెట్టి తర్వాత రోజు చపాతి చేసుకుందామని అనుకుంటారు.
కానీ అలా చేయడం కూడా మంచిది కాదు. హానికరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి అవడంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఒక ప్లేట్ లో మూడు చపాతీలను కానీ అంత కంటే ఎక్కువ కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి సంతాప దినం చేస్తారు. కర్మలో మరణించిన వారికి మూడు చపాతీలు పెడతారు. కాబట్టి ఆ తప్పును చేయకండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…