ఆధార్ కార్డు ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మనకు రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రాముఖ్యత కూడా అంతే ఉంది. ప్రభుత్వం నుంచి లభించే ప్రతి పథకాన్ని లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డ్ అవసరం ఎంత అయితే ఉందో వాటి ద్వారా జరిగే మోసాలు కూడా అధికమయ్యాయి.ఈ క్రమంలోనే ఆధార్ కార్డు వినియోగించే వినియోగదారులందరూ కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని యూఐడీఏఐ హెచ్చరిస్తోంది.
ఆధార్ కార్డు తరచూ వినియోగిస్తున్న వినియోగదారులు ఆధార్ నెంబర్ ను కేవలం ఒక ప్రూఫ్ గా మాత్రమే వినియోగించవద్దని, ఎవరైనా ఆధార్ నెంబర్ చెబితే ఆ నెంబర్ మరొకసారి చెక్ చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ అయితే ఆధార్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ అయితే ఆధార్ వెరిఫై సర్వీసులను ఉపయోగించుకోవాలి. ఇలా చేసి ఆధార్ నెంబర్ ను ధ్రువీకరించుకోవాలి. ఇలా చేసినప్పుడు ఎలాంటి మోసాలకు తావుండదు.
చాలామంది పబ్లిక్ కంప్యూటర్లు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెంటనే వాటిని డిలీట్ చేయాలి. అదేవిధంగా మన ఆధార్ కు సంబంధించిన ఓటిపి ఎవరికీ చెప్పకూడదు. అలాగే వేరొకరి ఆధార్ నెంబర్ ను మన మొబైల్ కి అప్డేట్ చేసుకోవద్దని ఈ సందర్భంగా యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలు వెల్లడించింది. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మోసాలకు చెక్ పెట్టవచ్చునని అధికారులు వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…