ఆధార్ కార్డు ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మనకు రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రాముఖ్యత కూడా అంతే ఉంది. ప్రభుత్వం నుంచి లభించే ప్రతి పథకాన్ని లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డ్ అవసరం ఎంత అయితే ఉందో వాటి ద్వారా జరిగే మోసాలు కూడా అధికమయ్యాయి.ఈ క్రమంలోనే ఆధార్ కార్డు వినియోగించే వినియోగదారులందరూ కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని యూఐడీఏఐ హెచ్చరిస్తోంది.
ఆధార్ కార్డు తరచూ వినియోగిస్తున్న వినియోగదారులు ఆధార్ నెంబర్ ను కేవలం ఒక ప్రూఫ్ గా మాత్రమే వినియోగించవద్దని, ఎవరైనా ఆధార్ నెంబర్ చెబితే ఆ నెంబర్ మరొకసారి చెక్ చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ అయితే ఆధార్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ అయితే ఆధార్ వెరిఫై సర్వీసులను ఉపయోగించుకోవాలి. ఇలా చేసి ఆధార్ నెంబర్ ను ధ్రువీకరించుకోవాలి. ఇలా చేసినప్పుడు ఎలాంటి మోసాలకు తావుండదు.
చాలామంది పబ్లిక్ కంప్యూటర్లు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెంటనే వాటిని డిలీట్ చేయాలి. అదేవిధంగా మన ఆధార్ కు సంబంధించిన ఓటిపి ఎవరికీ చెప్పకూడదు. అలాగే వేరొకరి ఆధార్ నెంబర్ ను మన మొబైల్ కి అప్డేట్ చేసుకోవద్దని ఈ సందర్భంగా యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలు వెల్లడించింది. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మోసాలకు చెక్ పెట్టవచ్చునని అధికారులు వెల్లడించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…